Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిబిటి పథకాల కింద నిధుల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్

సెల్వి
గురువారం, 16 మే 2024 (14:48 IST)
డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) పథకాల కింద నిధుల విడుదలకు ఎన్నికల సంఘం (ఇసి) అనుమతి మంజూరు చేసింది. నిన్న(బుధవారం) ఆసరాకు రూ.1,480 కోట్లు, జగనన్న విద్యా దీవెనకు రూ.502 కోట్లు కేటాయించారు. 
 
ఈ నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ చేసేందుకు జవహర్ రెడ్డికి ఈసీ అధికారం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు పథకాలకు నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు కూడా అదనపు నిధులు విడుదల చేసేందుకు సిద్ధమైంది.
 
గతంలో టీడీపీ ఫిర్యాదుల కారణంగా సీఈవో ముఖేష్ కుమార్ మీనా పోలింగ్‌కు ముందే డీబీటీ కింద నిధుల విడుదలను నిలిపివేశారు. అయితే మే 13న పోలింగ్ ముగిసిన తర్వాత నిధుల విడుదలకు ఈసీ ఆమోదం తెలిపింది. 
 
ఈసీ ఆదేశాల మేరకు మే 15న ప్రభుత్వం ఆసరా, జగనన్న విద్యా దీవెన కింద లబ్ధిదారుల ఖాతాల్లోకి మొత్తం రూ.1,982 కోట్లు జమ చేసింది. ఇతర పథకాలకు కూడా డీబీటీ పద్ధతిలో వచ్చే రెండు, మూడు రోజుల్లో నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments