Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీఎస్ ఆర్టీసీకి షాకిచ్చిన చమురు కంపెనీలు.. చార్జీల వడ్డన తప్పదా?

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (09:15 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ ఆర్టీసీకి చమురు కంపెనీలు తేరుకోలేని షాకిచ్చింది. అసలే మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఉన్న ఆర్టీసీకి ఇపుడు చమురు కంపెనీలు ఇచ్చిన షాక్‌తో ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఆర్టీసీకి సరఫరా చేసే ఇంధన ధరలను గుట్టుచప్పుడు కాకుండా పెంచేశాయి. 
 
బయట పెట్రోల్ బంకుల్లో ఇచ్చే ధర కంటే ఆర్టీసీకి సరఫరా చేసే ధరలో లీటరుకు రూ.4.30పైసలు వరకు అదనంగా వడ్డిస్తున్నాయి. దీంతో ఆర్టీసీకి రోజుకు పది కోట్ల రూపాయల మేరకు భారం పడుతోందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు. 
 
ఏపీ రాష్ట్రంలో ప్రతి రోజూ 10 వేల బస్సులు వివిధ రూట్లలో తిరుగుతున్నాయి. ఈ బస్సులకు నిత్యం 7.30 లక్షల లీటల్ డీజిల్‌‌ ఖర్చు అవుతుంది. ఈ కారణంగా ఆర్టీసీకి  ఇచ్చే చమురు ధరలో రాయితీ ఇస్తూ వస్తున్నాయి. బయట పెట్రోల్ బంకుల్లో విక్రయించే ధరతో పోల్చితే ఈ ధర రూ.2 వరకు తక్కువగా ఉంటుంది. 
 
అయితే, గత పది రోజులుగా లీటరుకు రూ.4.30 పైసలు చొప్పున అదనంగా వడ్డిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో చమురు కంపెనీలు ఆర్టీసీ వంటి సంస్థలకు సరఫరా చేసే ఇంధన ధరలను పెంచేసింది. చమురు కంపెనీలు ఇచ్చిన షాక్‌తో ప్రజలపై భారం మోపే దిశగా ఆర్టీసీ ప్రయత్నాలు ప్రారంభించింది. అంటే బస్సు చార్జీలను పెంచే దిశగా ఆలోచన చేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments