Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీఎస్ ఆర్టీసీకి షాకిచ్చిన చమురు కంపెనీలు.. చార్జీల వడ్డన తప్పదా?

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (09:15 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ ఆర్టీసీకి చమురు కంపెనీలు తేరుకోలేని షాకిచ్చింది. అసలే మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఉన్న ఆర్టీసీకి ఇపుడు చమురు కంపెనీలు ఇచ్చిన షాక్‌తో ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఆర్టీసీకి సరఫరా చేసే ఇంధన ధరలను గుట్టుచప్పుడు కాకుండా పెంచేశాయి. 
 
బయట పెట్రోల్ బంకుల్లో ఇచ్చే ధర కంటే ఆర్టీసీకి సరఫరా చేసే ధరలో లీటరుకు రూ.4.30పైసలు వరకు అదనంగా వడ్డిస్తున్నాయి. దీంతో ఆర్టీసీకి రోజుకు పది కోట్ల రూపాయల మేరకు భారం పడుతోందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు. 
 
ఏపీ రాష్ట్రంలో ప్రతి రోజూ 10 వేల బస్సులు వివిధ రూట్లలో తిరుగుతున్నాయి. ఈ బస్సులకు నిత్యం 7.30 లక్షల లీటల్ డీజిల్‌‌ ఖర్చు అవుతుంది. ఈ కారణంగా ఆర్టీసీకి  ఇచ్చే చమురు ధరలో రాయితీ ఇస్తూ వస్తున్నాయి. బయట పెట్రోల్ బంకుల్లో విక్రయించే ధరతో పోల్చితే ఈ ధర రూ.2 వరకు తక్కువగా ఉంటుంది. 
 
అయితే, గత పది రోజులుగా లీటరుకు రూ.4.30 పైసలు చొప్పున అదనంగా వడ్డిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో చమురు కంపెనీలు ఆర్టీసీ వంటి సంస్థలకు సరఫరా చేసే ఇంధన ధరలను పెంచేసింది. చమురు కంపెనీలు ఇచ్చిన షాక్‌తో ప్రజలపై భారం మోపే దిశగా ఆర్టీసీ ప్రయత్నాలు ప్రారంభించింది. అంటే బస్సు చార్జీలను పెంచే దిశగా ఆలోచన చేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

నరేష్ అగస్త్య కొత్త చిత్రం మేఘాలు చెప్పిన ప్రేమ కథ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments