Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో నలుగురు మైనర్లు మిస్సింగ్, అర్థరాత్రి నుంచి వెతుకుతున్న పోలీసులు

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (19:39 IST)
లాక్ డౌన్ దెబ్బకు ఇంట్లోనే మగ్గిపోతున్న పిల్లలు బయట కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ఆటపాటలతో చలాకీగా గడుపుతున్నారు. ఐతే ఇలా ఆడుకుని వస్తామని బయటకు వెళ్లిన నలుగురు టీనేజ్ పిల్లలు కనిపించకుండా పోయారు. ఒకేసారి నలుగురు కనిపించకపోవడంతో ఆందోళన చెలరేగింది.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. గుంటూరు సిటీలో వున్న నెహ్రూ నగర్‌లో గురువారం సాయంత్రం నలుగురు టీనేజ్ పిల్లలు ఆడుకుని వస్తామని చెప్పి వెళ్లారు. వారిలో ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు. బాలికల వయసు 14, 15 కాగా అబ్బాయిల వయసు 13, 17. వీరిలో ముగ్గురు పిల్లది ఒకే కుటుంబం.
 
ఐతే ఆడుకుని వస్తారులే అని ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు తమ బిడ్డలు ఇంటికి రాకపోయేసరికి వాళ్లు వెళ్లిన దగ్గర వెతికి చూసారు. అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. సమీపంలోని వారి వద్ద వాకబు చేసినా ఆచూకి లభించకపోవడంతో వెంటనే గుంటూరు కొత్తపేట పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిన్న అర్థరాత్రి నుంచి గుంటూరులో ప్రధాన ప్రాంతాల్లో పిల్లల కోసం గాలిస్తున్నారు. కానీ ఇంతవరకూ వారి ఆచూకి లభించలేదు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments