Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్ధరూపాయి కూడా ఇవ్వను, ఓటు వేయకపోతే పోండి: మాజీ కేంద్రమంత్రి చింతామోహన్

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (20:20 IST)
తిరుపతి ఉప ఎన్నికలు నువ్వా నేనా అన్నట్లు హాట్ హాట్‌గా నడుస్తోంది. ప్రధాన పార్టీలకు ధీటుగా కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల కదన రంగం లోకి దూకింది. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు ఆరుసార్లు ఎంపీగా గెలిచిన చింతామోహన్ ఈసారి ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్నారు.
 
100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ హయాంలో తిరుపతి పార్లమెంటు పరిధిలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ చింతా మోహన్ ప్రచారం కొనసాగిస్తున్నారు. అయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్‌తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చింతా మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
 
తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార వైసిపి ఇప్పటికే ప్రలోభాలకు తెరలేపిందని ఆరోపించారు. వైసీపీ నేతలు ఇచ్చిన డబ్బులు తాను ఇవ్వలేనని అసలు అర్ధరూపాయి కూడా ఓటర్లకు ఇచ్చే పరిస్థితిలో తాను లేనని, ఓటు వేయాలని ఉన్నవారు వేయచ్చు.. ఓటు వేయకపోయినా పర్వాలేదన్నారు చింతా మోహన్. 
 
ప్రధాన పార్టీల కన్నా ధీటుగా చింతా మోహన్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా కేవలం ముగ్గురే ముగ్గురితో నామినేషన్ దాఖలు చేశారు. ప్రచారాన్ని కూడా కొడుకు, కూతురుతో కలిసి చేస్తున్నారు. అయితే మీడియాతో మాట్లాడుతున్న ప్రతిసారి చింతా మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments