Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండ్రాయిలా ఉన్నారు? ఏపీలో అల్లుడు వైద్యంపై నమ్మకం లేదా?

Webdunia
బుధవారం, 22 జులై 2020 (11:16 IST)
వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. దీనిపై విపక్ష టీడీపీ నేతలు తమకు తోసినవిధంగా సెటైర్లు వేస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. 
 
బీసీ నాయకుడైన అచ్చెన్నాయుడిని ఘోరంగా అవమానించారని.. అసలు విజయసాయిరెడ్డి మనిషేనా? అంటూ మండిపడ్డారు. 'విజయసాయి రెడ్డి మనిషేనా? ఒక బీసీ నాయకుడిని ఘోరంగా అవమానించారు. ఆరోగ్యంగా గుండ్రాయిలా ఉన్నా ఈ డ్రామాలేంటి అచ్చన్నా? కార్పొరేట్ ఆస్పత్రి కావాలా? ఈఎస్ఐ వద్దా' అంటూ ట్వీట్లు పెట్టి సాయిరెడ్డి హింసించారు. 
 
మరి ఇప్పుడు విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్ రాగానే ప్రత్యేక విమానంలో వైజాగ్ నుంచి హైదరాబాద్ ఎందుకు పారిపోయారు? వైకాపా నాయకులకు హైదరాబాద్‌లో కార్పొరేట్ వైద్యమా? ప్రజాలకేమో పులిహోర ప్యాకెట్ల వైద్యమా? గుండ్రాయిలా ఉన్న సాయిరెడ్డి విశాఖ కేజీ హెచ్‌లో ఎందుకు చేరలేదు? ఏపీలో అల్లుడు వైద్యం మీద నమ్మకం లేదా?' అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments