రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణరాజు కన్నుమూత

Webdunia
గురువారం, 13 జులై 2023 (08:55 IST)
రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు కన్నుమూశారు. ఈయన వయసు 83 యేళ్లు. వయోభారంతో పాటు అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన గురువారం ఉదయం హైదరాబాద్ నగరంలో మృతి చెందారు. ఆయన భౌతికకాయాన్ని సఖినేటిపల్లిలోని స్వగృహానికి తరలించి ప్రజలు, నేతలు సందర్శనార్థం ఉంచారు. గురువారం మధ్యాహ్నం సోంపల్లిలోని శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు. 
 
గత 2004-09 మధ్యకాలంలో ఆయన రాజోలు ఎమ్మెల్యేగా పని చేశారు. ప్రస్తుతం వైకాపా ఉన్నారు. ఆయన తొలిసారి గత 1999లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగి ఏవీసూర్యనారాయణ రాజుపై విజయం సాధించారు. అల్లూరి కృష్ణంరాజు భార్య ప్రస్తుతం టీటీడీ పాలక మండలి సభ్యురాలిగా కొనసాగుతున్నారు. వీరికి శ్రీనివాసరాజు, కృష్ణకుమారి, విజయ అనే కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. శ్రీనివాసరాజు వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో స్థిరపడ్డారు. 
 
కృష్ణంరాజు భౌతికకాయాన్ని గురువారం సఖినేటిపల్లిలోని ఆయన నివాసానికి తరలించి, మధ్యాహ్నం సోంపల్లిలోని శ్మశానవాటికలో అధికారిక లాంఛలనాతో అంత్యక్రియలు నిర్వహిస్తామని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments