Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్జీతో సహవాసం.. చివరకు మతిస్థిమితం కోల్పోయిన బాలుడు

Webdunia
గురువారం, 13 జులై 2023 (08:12 IST)
రాజస్థాన్‌లో స్మార్ట్ ఫోన్ ఓ బాలుడి జీవితాన్ని చిదిమేసింది. స్మార్ట్‌ఫోనుకు బానిసైపోయిన ఓ పదేళ్ల బాలుడు చివరకు మతిస్థిమితం కోల్పోయాడు. రాజస్థాన్ అల్వార్‌కు చెందిన చిన్నారి నిత్యం ఫోనులో పబ్ జీ ఆడుతూ గడిపేవాడు. ఇటీవల గేమ్‌లో ఓడిపోయిన అతడు నిరాశను తట్టుకోలేక మతిస్థిమితం కోల్పోయాడు. 
 
ప్రస్తుతం అతడికి ప్రత్యేక పాఠశాలలో నిపుణుల సాయంతో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు చెప్తున్నారు. ప్రత్యేకమైన భౌతిక క్రీడలు ప్రత్యేకమైన భౌతిక క్రీడలు ఆడిస్తూ బాలుడికి నయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పాఠశాల టీచర్ భవానీ శర్మ వెల్లడించారు. 
 
బాలుడి తల్లి లక్ష్మి, పొరుగువాడు విద్యా ప్రయోజనాల కోసం అతనికి మొబైల్ ఫోన్ ఇచ్చాడని వెల్లడించింది. అయినప్పటికీ, బాలుడు ఫోన్‌ను అతిగా ఉపయోగించడం ప్రారంభించాడని వాపోయాడు. సమీపంలోని Wi-Fi నెట్‌వర్క్‌లకు కనెక్ట్ చేయడం, నిరంతరం గేమ్‌లు ఆడటం ప్రారంభించాడు. 
 
ఈ ప్రవర్తన కుటుంబ సభ్యులకు తెలియదు. PUBG గేమ్ దాని ప్రమాదకరమైన ప్రభావానికి కారణమైందని బాలుడి తల్లి వాపోయింది. ఎప్పుడుపడితే అప్పుడు పబ్జీ ఆడేవాడని.. ఆ ప్రవర్తనే అతడి కొంపముంచిందని చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments