Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎట్టకేలకు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు

ఠాగూర్
గురువారం, 13 ఫిబ్రవరి 2025 (08:49 IST)
వైకాపా నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నగరంలో ఆయనను ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో దాడి కేసులో వల్లభనేని వంశీ ఓ నిందితుడుగా ఉన్న విషయం తెల్సిందే. గత కొంతకాలంగా పరారీలో ఉన్న ఆయనను హైదరాబాద్ నగరంలోని రాయదుర్గంలో అరెస్టు చేశారు. 
 
రాయదుర్గంలోని మై హోం భుజాలో ఉండగా గుర్తించి అరెస్టు చేసారు. ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా విజయవాడకు తీసుకొస్తున్నట్టు సమాచారం. అయితే, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులోనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారా లేదంటే మరో కేసులోనా అనేది తెలియాల్సివుంది. 
 
గన్నవరం టీడీపీ కార్యాలయంలో గత 2023 ఫిబ్రవరి 20వ తేదీన దాడి జరిగింది. ఈ కేసులో వంశీ సహా 88 మంది నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా పోలీసులను ఆదేశించాలంటూ కోర్టులో వంశీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 20వ తేదీన విచారణ జరుగనుంది. అంతలోనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments