సీఎం జగన్ మోహన్ రెడ్డికి మాజీ సీఎం చంద్రబాబు తొలి అభ్యర్థన... ఏంటది?

Webdunia
బుధవారం, 5 జూన్ 2019 (18:04 IST)
ఓడలు బళ్లవుతాయి... బళ్లు ఓడలవుతాయి అని మన పెద్దలు చెప్పే సామెత తెలిసిందే. రాజకీయాల్లో ఇది మరీ ఎక్కువ. ఐదేళ్ల క్రితం దర్పంతో వుండే ముఖ్యమంత్రులు తదుపరి ఎన్నికల్లో ఏమీ లేకుండా అయిపోతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిస్థితి అలాగే తయారైంది. ఇప్పటికే పార్టీలో ఓడిన నాయకులు పక్కచూపులు చూస్తున్నారు. మరికొందరేమో... పార్టీ బాధ్యతలు అప్పజెపుతుంటే... మాకొద్దు అంటూ ముఖం మీదే చెప్పేస్తున్నారు. ఇదీ అధికారం పోయిన తర్వాత పరిస్థితి. 
 
ఇక అసలు విషయానికి వస్తే... మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తొలిసారిగా ఓ అభ్యర్థన చేశారు. అదేమిటంటే.. తను ప్రస్తుతం వుంటున్న నివాసం పక్కనే వున్న ప్రజావేదికను తన అధికారిక కార్యకలాపాల కోసం కేటాయించాలన్నది. ఎన్నికలకు ముందు తను ఏ గృహంలో అయితే వుంటున్నానో అదే ఇంట్లో తను వుండాలని నిర్ణయించుకున్నాననీ, దాని ప్రక్కనే వున్న ప్రజావేదిక ఖాళీగా వుండటంతో దాన్ని తన అధికారిక కార్యకలాపాలను జరుపుకునేందుకు ఇవ్వాలంటూ అభ్యర్థించారు. మాజీ సీఎం అభ్యర్థనకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తారని అనుకుంటున్నారు. ఏం చేస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments