Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఆర్ఆర్‌పై హత్యాయత్నం కేసు : ఐపీఎస్ అధికారికి నోటీసులు (Video)

ఠాగూర్
ఆదివారం, 2 మార్చి 2025 (12:56 IST)
ఏపీ అసెంబ్లీ ఉపసభావతి రఘురామకృష్ణంరాజుపై హత్యాయత్నం కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌కు ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. అప్పట్లో ఏపీ సీఐడీ డీఐజీగా సునీల్ నాయక్ పనిచేశారు. దీంతో ఆయన వద్ద విచారించేందుకు వీలుగా రఘురామకృష్ణంరాజు కేసు దర్యాప్తు అధికారి, ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ రెండు రోజుల క్రితం నోటీసులు పంపించారు. 
 
రఘురామరాజును హైదరాబాద్ నగరంలో అరెస్టు చేసి గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చినపుడు సునీల్ నాయక్ కూడా వచ్చినట్టు దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనలో ఆయన పాత్రపైనా విచారించాలని నిర్ణయించిన అధికారులు ఫ్యాక్స్, వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించారు. 
 
బీహార్ క్యాడర్‌‍కు చెందిన సునీల్ నాయక్... వైకాపా ప్రభుత్వం డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తీసుకొచ్చి సీఐడీ డీఐజీగా పోస్టింగ్ ఇచ్చింది. ఏపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి రాగానే సునీల్ నాయక్ తిరిగి బీహార్ వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన ఆ రాష్ట్ర అగ్నిమాపకశాఖలో డీఐజీగా పని చేస్తున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments