వికటించిన వివాహ పాయసం... 500 మందికి అస్వస్థత

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (11:19 IST)
తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ జిల్లాలో ఓ వివాహ విందులో వడ్డించిన పాయసం వికటించింది. దీంతో 500 మంది వరకు ఆహుతులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వీరంతా ప్రస్తుతం సమీపంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 
 
నిర్మల్ జిల్లా భైంసాలో ఓ వివాహ వేడుక పట్టణంలోని డీసెంట్‌ ఫంక్షన్‌ హాలులో జరిగింది. ఈ వివాహ వేడుకలో భాగంగా, విందు భోజనంతో పాటు వడ్డించిన పాయసం వికటించింది. విందులో వడ్డించిన పాయసం ఆరగించిన తర్వాత వారందరికీ వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో దాదాపు 500 మంది వరకు అస్వస్థతకు లోనయ్యారు. 
 
బాధితులను చికిత్స నిమిత్తం భైంసా ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. తొలుత పదుల సంఖ్యలోనే అస్వస్థతకు గురైనప్పటికీ.. క్రమంగా వారి సంఖ్య వందల సంఖ్యకు చేరుకోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. వైద్య సిబ్బంది బాధితులకు వైద్య సేవలందిస్తున్నారు. అస్వస్థతకు గురైనవారిలో ఎక్కువ మంది చిన్నారులే ఉండటం గమనార్హం. వీరంతా మొదటి, రెండు బంతుల్లో వడ్డించిన పాయసం ఆరగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments