Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమండ్రి వద్ద గోదావరి మహోగ్రరూపం

Webdunia
గురువారం, 14 జులై 2022 (09:29 IST)
తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఏరులై ప్రవహిస్తున్నారు. వరద నీరు అనేక ప్రాంతాలను నీట ముంచేశాయి. ఈ వరద నీటి ప్రవాహంత గోదావరి నది మహోగ్రరూపం దాల్చుతుంది. రాజమండ్రి వద్ద ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 15.37లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 
 
ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. మరోవైపు భద్రాచలం వద్ద కూడా వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం అక్కడ వరద 58.5 అడుగులకు చేరుకుంది.
 
బుధవారం ఉదయమే రెండో ప్రమాద హెచ్చరికను జారీచేశారు. అయితే, సాయంత్రానికి ఈ నీటి ప్రవాహం మరింతగా పెరిగిపోయింది. గోదావరి నదిలో వరద ప్రవాహం 15 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీచేసింది. అయితే వరద తగ్గుముఖం పడుతుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు.
 
'సాయంత్రం నాటికి తీవ్రత తగ్గవచ్చు, కానీ ఇప్పటికీ హాని కలిగించే ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి' అని అంబేద్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. అల్లూరి సీతారామరాజు, కోనసీమ, ఏలూరు జిల్లాల్లోని పలు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే, ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments