Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘోరం, ఓటు వేయడానికి వచ్చి బస్సు ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనం - video

ఐవీఆర్
బుధవారం, 15 మే 2024 (09:43 IST)
పల్నాడు జిల్లా చిలుకలూరి పేట మండలం ఈపూరిపాలెం వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. ప్రైవేట్ బస్సుని టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. దీనితో ఐదుగురు వ్యక్తులు బస్సులో సజీవదహనమయ్యారు. పూర్తి వివరాలు చూస్తే... బాపట్ల జిల్లా చినగంజాము నుంచి చీరాల మీదుగా బస్సు హైదరాబాదు వెళ్తోంది. ఈ బస్సులోని వారంతా తమ నియోజకవర్గంలో ఓట్లు వేసి తిరిగి వెళుతున్నారు.
 
ఈ క్రమంలో బస్సు ఈపూరిపాలంకి చేరుకోగానే వేగంగా వచ్చిన టిప్పర్ బస్సును ఢీకొట్టింది. టిప్పర్ లో చెలరేగిన మంటలు బస్సుకి అంటుకున్నాయి. దీనితో క్షణకాలంలోనే మంటలు బస్సులో వ్యాపించాయి. పలువురు తప్పించుకున్నప్పటికీ బస్సు డ్రైవర్, టిప్పర్ డ్రైవర్ సహా ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు సజీవ దహనమయ్యారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మృతులు బాపట్ల జిల్లా నీలాయపాలెంకి చెందినవారిగా గుర్తించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments