Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘోరం, ఓటు వేయడానికి వచ్చి బస్సు ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనం - video

ఐవీఆర్
బుధవారం, 15 మే 2024 (09:43 IST)
పల్నాడు జిల్లా చిలుకలూరి పేట మండలం ఈపూరిపాలెం వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. ప్రైవేట్ బస్సుని టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. దీనితో ఐదుగురు వ్యక్తులు బస్సులో సజీవదహనమయ్యారు. పూర్తి వివరాలు చూస్తే... బాపట్ల జిల్లా చినగంజాము నుంచి చీరాల మీదుగా బస్సు హైదరాబాదు వెళ్తోంది. ఈ బస్సులోని వారంతా తమ నియోజకవర్గంలో ఓట్లు వేసి తిరిగి వెళుతున్నారు.
 
ఈ క్రమంలో బస్సు ఈపూరిపాలంకి చేరుకోగానే వేగంగా వచ్చిన టిప్పర్ బస్సును ఢీకొట్టింది. టిప్పర్ లో చెలరేగిన మంటలు బస్సుకి అంటుకున్నాయి. దీనితో క్షణకాలంలోనే మంటలు బస్సులో వ్యాపించాయి. పలువురు తప్పించుకున్నప్పటికీ బస్సు డ్రైవర్, టిప్పర్ డ్రైవర్ సహా ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు సజీవ దహనమయ్యారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మృతులు బాపట్ల జిల్లా నీలాయపాలెంకి చెందినవారిగా గుర్తించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" షూటింగుకు మళ్లీ బ్రేక్ ... డెంగ్యూబారినపడిన నటుడు!

బాలు వెళ్లిపోయాక అంతా చీకటైపోయింది ... : పి.సుశీల

Raviteja: వినాయక చవితికి రవితేజ మాస్ జాతార చిత్రం సిద్దం

Gaddar Award : అల్లు అర్జున్, నాగ్ అశ్విన్ లకు బెస్ట్ అవార్డులు ప్రకటించిన గద్దర్ అవార్డ్ కమిటీ

Sreeleela: పవన్ కళ్యాణ్ ఓజీ కోసం వస్తున్నారు.. డేట్లు సర్దుకో.. ఓకే చెప్పిన శ్రీలీల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments