Webdunia - Bharat's app for daily news and videos

Install App

గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

ఠాగూర్
మంగళవారం, 27 ఆగస్టు 2024 (09:14 IST)
ఏపీలోని వైఎస్ఆర్ కడప జిల్లా రామాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. చింతకొమ్మదిన్నె పరిధిలో కారు - కంటైనర్ వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్న నలుగురితో పాటు కంటైనర్ డ్రైవర్ కూడా చనిపోయాడు. కారులో ఉన్నవారంతా బంధువుల అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదంలో చిక్కుకుని తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. మృతులంతా చక్రాయపేట మండలం కొన్నేపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. 
 
కాగా, రోడ్డు ప్రమదాం ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ వి.హర్షవర్థన్ రాజు పరిశీలించారు. విషయం తెలుసుకున్న వెంటనే ఆయన ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును, అందుకు గల కారణాలను నిశితంగా పరిశీలించారు. ప్రమాద ఘటనపై జిల్లా ఎస్పీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఎస్పీ వెంట ఎస్.బి. ఇన్‌స్పెక్టర్ యు.వెంకటకుమార్, సీకె దిన్నె, సీై శంకర్ నాయక్ రామాపుర సీఐ వెంకట కొండారెడ్డిలు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments