Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహాచలం మృతురాలి కుటుంబానికి రూ.9 లక్షల పరిహారం

Webdunia
శనివారం, 3 ఆగస్టు 2019 (12:35 IST)
విశాఖ జిల్లా సింహగిరి మెట్లమార్గంలో బండరాళ్లు దొర్లిపడి మహిళ మృతి చెందడంతో సింహాచలం దేవస్థానం అధికారులు నష్టనివారణ చర్యలు తీసుకుంటున్నారు. సింహగిరి మెట్లమార్గంలో మరమ్మతు పనులు జరుగుతుండటంతో భక్తుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. 
 
ఆకాశధార దగ్గర నుంచి ఆంజనేయస్వామి ఆలయం వరకూ ప్రమాదకరంగా ఉన్న రాళ్లను తొలగించాలని అధికారులు నిర్ణయించారు. మెట్లను ఆనుకుని ఉన్న రాళ్లను ముందుగా తొలగించనున్నారు. భవిష్యత్తులో పనుల జరిగేటప్పుడు రాళ్లు జారిపడకుండా ఇనుప‌ మెస్‌ ఏర్పాటుచేయాలని డిసైడయ్యారు.
 
ప్రస్తుతానికి భక్తులు మెట్లమార్గంలోకి రాకుండా సింహగిరిపైన, కొండ దిగువన తొలిపావంచా దగ్గర దారులను మూసివేశారు. సెక్యూరిటీ గార్డులను అక్కడ నియమించారు.
 
మెట్లమార్గంలో ప్రమాదవశాత్తు చనిపోయిన ఆదిరెడ్డి భవానీ కుటుంబానికి దేవస్థానం తరపున రూ.5 లక్షలు, పనులు చేస్తున్న కాంట్రాక్టర్ నుంచి రూ.3 లక్షలు, ఇంజినీరింగ్‌ అధికారులు రూ.లక్ష మొత్తం 9 లక్షలు తక్షణ సాయంగా అందిస్తామని అధికారులు చెప్పారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments