Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ వ్యక్తిగత హాజరుపై తీర్పు రిజర్వ్

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (19:56 IST)
ఆదాయానికి మించిన కేసులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత హాజరుపై కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఇప్పటికే విచారణ ఎదుర్కొంటారు జగన్. అంతేగాకుండా జైలు శిక్ష అనుభవించిన జగన్ బెయిల్‌పై బయట వున్నారు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో సీఎం హోదాలో వున్న ఆయన సాక్షులను ప్రభావితం చేసే ఛాన్సుందని ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. 
 
అలాగే ప్రతి శుక్రవారం కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి తనను మినహాయించాలన్న జగన్ పిటిషన్ విచారణ కూడా కోర్టులో చాలాకాలంగా పెండింగ్‌లో ఉంది.
 
తాజాగా నేడు జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపుపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. సీఎం హోదాలో జగన్ సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని, అందుకే ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వొద్దని హైకోర్టును సీబీఐ తరఫు న్యాయవాదులు కోరారు.  
 
అయితే, సీఎం హాదాలో ఉన్న జగన్ బిజీగా ఉంటారని, కాబట్టి ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునివ్వాలని జగన్ తరఫు న్యాయవాదులు కోరు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు…తీర్పును రిజర్వ్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments