Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్జీ పాలిమర్స్ ఘటనపై త్వ‌ర‌లోనే తుది నివేదిక: హైపవర్ కమిటీ చైర్మన్ నీరబ్‌కుమార్ ప్రసాద్

Webdunia
మంగళవారం, 16 జూన్ 2020 (21:18 IST)
ఎల్జీ పాలిమర్స్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు మరియు ఇతర అందరి సభ్యుల నుంచి సేకరించిన సమాచారం ఆదారంగా తుది నివేదికను త్వరలో సిద్ధం చేయనున్నామని హైపవర్ కమిటీ చైర్మన్ నీరబ్‌కుమార్ ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

మే 5, 2020 తెల్లవారుజామున 3 గంటలకు విశాఖపట్నం జిల్లా ఆర్.ఆర్ వెంకటాపురం ఎల్జీ పాలిమర్స్ లో సంభవించిన ప్రమాద ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించిన విషయం తెలిసిందేనని ఆయన తెలిపారు.

సదర్ హైపవర్ కమిటీని గ్యాస్ స్టోరేజ్ ట్యాంక్ నుండి గ్యాస్ లీక్ అవ్వటానికి కారణమైన అంశాలను గురించి వివరాలు సేకరించడానికి తదనంతరం తీసుకున్న నివారణ చర్యలు గురించి అధ్యయనం చేయటానికి ఈ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని ఆయన తెలిపారు.

తన పనిలో భాగంగా తమ కమిటీ ఇప్పటికే సంబంధం ఉన్న అందరి నుండి సలహాలు, సూచనలు ప్రశ్నలు సేకరించడం జరిగిందని హైపవర్ కమిటీ చైర్మన్ శ్రీ నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. దానిలో భాగంగా 243 రిప్రజెంటేషన్ 175 టెలిఫోన్ పబ్లిక్ వాట్సాప్ ను రిసీవ్ చేసుకున్నామన్నారు.

దాని ఆధారంగా కమిటీ ఒక ప్రశ్నావళి రూపొందించి ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ మరియు ఇతర రెగ్యులేటరీ అధారిటీ ద్వారా అందించడం జరిగిందని, ఇంకా ఎల్జీ పాలిమర్స్ నుంచి జవాబు అందాల్సి ఉందని ఆయన తెలిపారు.

కొంతమంది రెగ్యులేటర్స్  నుంచి సమాధానాలు వచ్చినప్పటికీ ఇంకా కొంతమంది తమ సమాధానం ఇవ్వాల్సి ఉందన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను హైపవర్ కమిటీ తుది జాబితాలో పొందుపరచడం జరుగుతుందని ఆయన తెలిపారు.

మే 9, 10, 11, 2020 మరియు 6, 7, 8, 2020 న తెలిపిన ఈ రోజుల్లో విశాఖపట్నం సందర్శించిన హైపవర్ కమిటీ స్టేక్ హోల్డర్స్ అందరితో సుదీర్ఘ చర్చలు నిర్వహించిందన్నారు.

జూన్ 15, 2020 నాడు డాక్టర్ సాగర్ ధార ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ అండ్ ఎన్విరాన్మెంటలిస్ట్ హైదరాబాద్ మరియు డాక్టర్ బాబురావు సైంటిస్ట్ హైదరాబాద్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించామన్నారు.

యాక్సిడెంట్‌కి సంబంధించి మరియు ప్రమాదానికి సంబంధించిన కారణాలు తదనంతర ఘటనలపై విస్తృతంగా చర్చించడం జరిగిందన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వచ్చే వారంలో హైపవర్ కమిటీ మరిన్ని సమావేశాలు రెగ్యులేటరీ ఆథారిటీతో కలిపి నిర్వహించనుందని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments