Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో వైకాపా వర్సెస్ టీడీపీ కొట్లాట - 17 మందికి గాయాలు

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (11:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణాత్మక వైఖరి పెరిగిపోతోంది. ఫలితంగా ఇరు పార్టీల మధ్య కక్షలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఫలితంగా వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య నిత్యం ఏదో ప్రాంతంలో గొడవులు జరుగుతూనే ఉన్నాయి. 
 
తాజాగా గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం కారుమంచిలో వైకాపా, టీడీపీ కార్యకర్తలు, రాళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇరు వర్గాల వారిలో కొందరు గాయపడ్డారు. ఇటీవలే కారుమంచిలో తిరునాళ్లు జరిగాయి. అప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య వివాదం నడుస్తుంది. తాజాగా ఆ వివాదం ముదిరి ఘర్షణకు దారితీసింది. 
 
ఈ ఘర్షణ నేపథ్యంలో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ఇరు వర్గాల వారిని అదుపు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ కొట్లాటలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamal Haasan: హే రామ్ సినిమా.. కమల్ హాసన్ లవ్ స్టోరీ గురించి చెప్పేసిన శ్రుతి హాసన్

Suchitra: షణ్ముగరాజ్‌పై ఆరోపణలు చేసిన సుచిత్ర.. అన్నీ లాగేసుకున్నాడు.. ఇన్‌స్టాలో వీడియో (video)

Lakshmi Menon: బార్‌లో గొడవ- ఐటీ ఉద్యోగినిపై దాడి, కిడ్నాప్.. అజ్ఞాతంలో లక్ష్మీ మీనన్ (video)

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments