పట్టాలకు మరమ్మతులు, ఇతర ఇంజనీరింగ్ పనుల కారణంగా విజయవాడ మీదుగా నడిచే అనేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. శుక్రవారం నుంచి ఐదు రోజుల పాటు ఈ రైళ్ళను రద్దు చేశారు. ఈ రైళ్లలో విజయవాడ, కాకినాడ, విశాఖపట్టణం నుంచి రైళ్లతో పాటు గుంటూరు మాచర్ల, గుంటూరు నడికుడి మధ్య నడిచే రైళ్లు ఉన్నాయి. ఈ రద్దు అయిన రైళ్లను ఓసారి పరిశీలిస్తే,
గుంటూరు-మాచర్ల (07779/07780) మధ్య నడిచే రైళ్లను గుంటూరు-నడికుడి మధ్య రద్దు చేశారు. అలాగే, విజయవాడ-మాచర్ల (07781/07780) రైళ్లను విజయవాడ-నడికుడి మధ్య రద్దు చేశారు.