Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరైన రహదారి లేక కొడుకు మృతదేహంతో తండ్రి పది కిలోమీటర్ల నడక!!

deadbody
వరుణ్
బుధవారం, 10 ఏప్రియల్ 2024 (08:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక గ్రామాలకు సరైన రహదారి వసతి లేదు. ఫలితంగా అనేక ప్రాంతాల్లో మృతదేహాలను సైతం సొంత గ్రామాలకు తరలించలేని పరిస్థితి నెలకొంది. తాజాగా అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో ఓ హృదయ విదాకర ఘటన చోటుచేసుకుంది. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఓ తండ్రి పుట్టెడు దుఃఖంలోనూ తన కుమారుడి మృతదేహాన్ని ఎత్తుకుని ఏకంగా ఎనిమిది కిలోమీటర్ల మేరకు నడిచాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అనంతగిరి మండలం పరిధిలోని రొంపల్లి పంచాయతీ చినకోనెలకు చెందిన సార కొత్తయయ్ కుటుంబంతో కలిసి గూంటూరు జిల్లా కొల్లూరు వద్ద ఇటుకల బట్టీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన చిన్న కుమారుడు ఈశ్వరీరావు (3) సోమవారం అనారోగ్యంతో చనిపోయాడు. దాంతో మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలించే ఏర్పాటు చేసుకున్నాడు. 
 
అయితే, అంబులెన్స్ డ్రైవర్ వారాని మంగళవారం తెల్లవారుజామున విజయనగరం జిల్లా మెంటాడ మండలం వనిజ వద్ద దించేసి వెళ్లిపోయాడు. ఇక అక్కడ నుంచి గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో మృతదేహాన్ని మోసుకుని కానినడకన వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments