Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుల బాధ తాళలేక మరో రైతు ఆత్మహత్య

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (19:28 IST)
కర్నూలు జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన రైతు గొల్ల నాగన్న(46) అప్పులబాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన మేరకు గొల్ల నాగన్న తనకున్న 9ఎకరాల భూమిలో వివిధ రకాల పంటలు సాగుచేశాడు. 
 
బోరుబావిలో నీరు తగ్గిపోవడంతో పంటలు ఎండిపోయి ప్రతిఏటా దిగుబడి తగ్గి నష్టాలపాలయ్యాడు. వ్యవసాయం కోసం ప్రైవేటు వ్యక్తుల వద్ద, బ్యాంకుల్లో సుమారు రూ.12 లక్షల దాకా అ ప్పులు చేశాడు. చేసిన అప్పులకు వడ్డీలు కూడా కట్టలేకపోయానని తరచూ భార్య రామక్కతో ఆవేదన చెందేవాడు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి కూడా ఆవేదనతోనే భోజనం చేశాడు. 
 
అనంతరం బయటకు వెళ్లి వస్తా అని చెప్పి వెళ్లాడు. మంగళవారం ఉదయం గ్రామ సమీపంలో ఓ చెట్టుకు పంచెతో వేసిన ఉరికి వేలాడుతున్న నాగన్నను అటుగా వెళ్తున్న గ్రామస్థులు గుర్తించి కుటుంబీకులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని బోరున విలపించారు. ఇతడికి భార్య, ముగ్గు రు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. రూరల్‌ ఎస్‌ఐ సుధాకర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments