Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 కోట్ల నకిలీ నోట్లు.. ఆంధ్రా, కర్ణాటక, తమిళనాడుల్లో మార్చేద్దామనుకున్నారు.. కానీ?

Webdunia
బుధవారం, 24 జులై 2019 (20:51 IST)
గుట్టుచప్పుడు కాకుండా దొంగ నోట్లను తయారుచేస్తూ చలామణి చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న నకిలీ ముఠాను కుప్పం పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఆరుగురిని అరెస్టు చేసే రెండు కోట్ల 72 లక్షల 22 వేల రూపాయలను స్వాధీనం చేసుకొని దొంగ నోట్ల తయారు చేసే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. దొంగ నోట్లు ప్రజల్లోకి వెళ్లే మునుపే పోలీసులు ముఠా సభ్యులను పట్టుకోవడం జరిగిందని చిత్తూరు జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు తెలిపారు. ప్రజలు దొంగ నోట్ల పట్ల అవగాహన కలిగి ఉన్నప్పుడే మోసపోకుండా ఉండవచ్చన్నారు.
 
చిత్తూరు జిల్లా ఎస్పీ వెంకటప్పల నాయుడు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కుప్పం మండలం సామగుట్టపల్లి గ్రామంలోని అనంత కుమార్ ఇంటిలో ఈ దొంగనోట్లను ముద్రించి విక్రయిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రం బరుగూరు తాలూకా కె నగర్ చెందిన కె. మణికంఠన్, క్రిష్ణగిరి తాలూకా ఎల్తిగిరి గ్రామానికి చెందిన కుబేంద్రన్, కుప్పం మండలం సామగుట్టపల్లికి చెందిన అనంత కుమార్, బురుగూరు తాలూకా కె.నగర్‌కు చెందిన సురేష్ కుమార్, తిరుపతి విద్యానగర్‌కు చెందిన దేవి రెడ్డి సురేష్ రెడ్డి, తిరుపతి అంబేద్కర్ కాలనీకి చెందిన హేమంత్ కుమార్‌లు ఒక ముఠాగా ఏర్పడి దొంగ నోట్లు ముద్రించి చలామణికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజలాపురం గ్రామంలో సప్తగిరి గ్రామీణ బ్యాంక్ వద్ద నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.
 
నిందితుల వద్ద నుండి దొంగనోట్ల ముద్రణకి ఉపయోగించే ల్యాప్‌టాప్‌లు, స్కానర్లు, ప్రింటర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగనోట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments