Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారికి కానుకంగా లగ్జరీ ఎలక్ట్రిక్ స్కూటర్ల గిఫ్ట్

ఠాగూర్
బుధవారం, 12 ఫిబ్రవరి 2025 (10:27 IST)
తిరుమల శ్రీవారికి ప్రముఖ ద్విచక్రవాహన తయారీ కంపెనీ టీవీఎస్ లగ్జరీ బైకును బహుమతిగా ప్రధానం చేసింది. ఈ వాహనాలను ఆ సంస్థ ఛైర్మన్ వేణు శ్రీనివాసన్ తితిదే అధికారులకు అందజేశారు. ఎన్డీఎస్ ఎకో సంస్థ కూడా ఓ ద్విచక్రవాహనాన్ని అందించింది. ఈ సందర్భంగా బైకు దాతలను తితిదే ఏవీవో వెంకయ్య చౌదరి అభినందించారు. 
 
సాధారణంగా శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు వచ్చే భక్తులు వివిధ రూపాల్లో మొక్కులు తీర్చుకుంటారు. తమ శక్తి మేరకు కానుకలు సమర్పిస్తుంటారు. వ్యాపార, వాణిజ్య ప్రముఖులు, రాజకీయ నేతలు, సినీ సెలెబ్రిటీలు భారీగా విరాళాలు ఇస్తుంటారు భక్తులు స్వామివారికి ఎక్కువగా నగదు, నగలు కానుకలుగా ఇస్తుంటారు. తాజాగా శ్రీవారికి ఖరీదైన లగ్జరీ బైకులను అందజేశారు. 
 
చెన్నైకు చెందిన టీవీసీ, బెంగుళూరు నగరానికి చెందిన ఎన్డీఎస్ ఎకో సంస్థలు ఈ ఎకో ద్విచక్రవాహనలను ఆయా సంస్థల అధినేతలు కానుకగా అందజేశారు. టీవీఎస్ అందించిన ఐక్యూబ్ ఎక్స్ వాహనం ధర రూ.2.70 లక్షలు కాగా, ఎన్డీఎస్ ఎకో అందించిన వాహనం ధర రూ.1.56 లక్షలని ఆయా సంస్థల ప్రతినిధులు వెల్లడించారు. 
 
ఆలయం వద్ద వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత బైక్ తాళాలను ఏఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ సంర్భంగా వారిని ఏఈవో అభినందించారు. ఈ కార్యక్రమంలో టీవీఎస్ సంస్థ ఛైర్మన్ వేణు శ్రీనివాసన్, ఎండీ సుదర్శన్, తిరుమల డీఐ సుబ్రహ్మణ్యం, ఎన్డీఎస్ ఎకో సంస్థ చైర్మన్ ఎంహెచ్ రెడ్డి తదితరులు ఉన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments