ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ సీపీ హవా కొనసాగుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతోపాటు తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లాలో కూడా వైఎస్సార్ సీపీ దూకుడు చూపిస్తోంది.
జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ స్థానాలకు గానూ 13 స్థానాల్లో వైఎస్సార్ సీపీ ఆధిక్యంలో ఉంది. ఒక్క స్థానంలో మాత్రమే టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. గత ఎన్నికల్లో రాష్ట్రంలోనే డిసైడింగ్ ఫ్యాక్టర్లలో ఒకటిగా నిలిచిన అనంతపురం జిల్లాలో టీడీపీకి ప్రస్తుత పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది.