బీజేపీలో చేరిన వైకాపా మాజీ నేత దారుణ హత్య...

ఠాగూర్
సోమవారం, 19 ఆగస్టు 2024 (15:11 IST)
కర్నూలు జిల్లా ఆదోనిలో దారుణం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరిన నేత దారుణ హత్యకు గురయ్యాడు. పార్టీ వీడటాన్ని జీర్ణించుకోలేని వైకాపా నేతలే ఈ దారుణానికి పాల్పడివుంటారని భావిస్తున్నారు. సోమవారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఆదోని మండలం, పెద్దహరివాణంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన శేఖన్న (50) గత మే నెలలో జరిగిన ఎన్నికల్లో వైకాపా తరపున క్రియాశీలకంగా వ్యవహరించారు. అయితే ఆ ఎన్నికల్లో వైకాపా చిత్తుగా ఓడిపోవడంతో ఆయన వైకాపాను వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు. దీన్ని స్థానిక వైకాపా నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేక పోయారు. 
 
ఈ క్రమంలో సోమవారం ఉదయం ఇంటి ముందు నిద్రిస్తున్న శేఖన్నను గుర్తు తెలియని దుండగులు గొంతకోసి హత్య చేశారు. గ్రామంలో అందరితో కలుపుగోలుగా ఉండే శేఖన్నకు ఎవరితోనూ ఎలాంటి విభేదాలు లేవని గ్రామస్థులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిత్ర మండలి బడ్డీస్ కామెడీ.. అందుకే జాతి రత్నాలుతో పోల్చుతున్నారు : నిర్మాతలు

Priyadarshi: ప్రేమంటే లో దోచావే నన్నే.. అంటూ ప్రియదర్శి, ఆనంది పై సాంగ్

Deepika : కల్కి 2, స్పిరిట్ సినిమాలకు క్రూరమైన వర్కింగ్ అవర్స్ అన్న దీపికా

HBD Rajamouli: ఎస్ఎస్ రాజమౌళి పుట్టిన రోజు.. మహేష్ బాబు సినిమా టైటిల్ అదేనా? (video)

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

తర్వాతి కథనం
Show comments