Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీలో చేరిన వైకాపా మాజీ నేత దారుణ హత్య...

ఠాగూర్
సోమవారం, 19 ఆగస్టు 2024 (15:11 IST)
కర్నూలు జిల్లా ఆదోనిలో దారుణం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరిన నేత దారుణ హత్యకు గురయ్యాడు. పార్టీ వీడటాన్ని జీర్ణించుకోలేని వైకాపా నేతలే ఈ దారుణానికి పాల్పడివుంటారని భావిస్తున్నారు. సోమవారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఆదోని మండలం, పెద్దహరివాణంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన శేఖన్న (50) గత మే నెలలో జరిగిన ఎన్నికల్లో వైకాపా తరపున క్రియాశీలకంగా వ్యవహరించారు. అయితే ఆ ఎన్నికల్లో వైకాపా చిత్తుగా ఓడిపోవడంతో ఆయన వైకాపాను వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు. దీన్ని స్థానిక వైకాపా నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేక పోయారు. 
 
ఈ క్రమంలో సోమవారం ఉదయం ఇంటి ముందు నిద్రిస్తున్న శేఖన్నను గుర్తు తెలియని దుండగులు గొంతకోసి హత్య చేశారు. గ్రామంలో అందరితో కలుపుగోలుగా ఉండే శేఖన్నకు ఎవరితోనూ ఎలాంటి విభేదాలు లేవని గ్రామస్థులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments