Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమ కుటుంబ సభ్యులు ఎవరూ రాజకీయాల్లోకి రారు : వెంకయ్య నాయుడు

ఠాగూర్
గురువారం, 13 ఫిబ్రవరి 2025 (11:07 IST)
ప్రస్తుతం తాను రాజకీయాల్లో లేనని, అలాగే, తమ కుటుంబ సభ్యులు ఎవరూ రాజకీయాల్లోకి రారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. నేటి పరిస్థితుల్లో తమ కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి రావాలని తాను కోరుకోవడం లేదని ఆయన అన్నారు. 
 
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని కొత్తపల్లి శ్రీరాములు కనకమ్మ లయన్ ఆడిటోరియంలో ఇమ్మణి వెంకట్, దీపల కుమారుడు, తన మనువడు విష్ణు వివాహ రిసెప్షన్ వేడుకల్లో వెంకయ్య నాయుడు తన సతీమణి ఉషతో కలిసి పాల్గొన్నారు. ఇందుకోసం ఆయన విశాఖపట్టణం నుంచి రాజమండ్రికి వందే భారత్ రైలులో చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో నిడదవోలుకు చేరుకున్నారు.
 
తన వియ్యంకుడు విష్ణురావు స్వగ్రామ నిడదవోలు కావడంతో వివాహ రిసెప్షన్‌ను అక్కడ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను భవిష్యత్‌లోనూ కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, అచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు బూరుగుపల్లి శేషారావు, శ్రీనివాస నాయుడు తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెళ్లి వయస్సు వచ్చింది, దెయ్యంకంటే మనుషులంటే భయం : విశ్వక్ సేన్

Kamal Hassan: మెగాస్టార్ చిరంజీవి కాదు.. రాజ్యసభకు కమల్ హాసన్?

ఫుల్ గడ్డంతో.. తండ్రిలాగే పంచె కట్టి సరికొత్త లుక్‌లో అకీరా నందన్

మా తాతగారు రసికుడు.. మెగాస్టార్ కామెంట్స్.. పవన్‌ పైన వైసిపి ట్రోల్స్

కన్నడ హీరో యష్‌తో కియారా అద్వానీకి కలిసి వస్తుందా?!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

Malida Sweet: తెలంగాణ వంటకాల్లో చిరు ధాన్యాలు.. మిగిలిన చపాతీలతో మలిదలు చేస్తారు.. తెలుసా?

Garlic: వెల్లుల్లితో చుండ్రు సమస్యకు చెక్.. వెల్లుల్లిని నూనె తయారీ ఎలా?

తర్వాతి కథనం
Show comments