Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊళ్లో అందరూ మంచోళ్లే.. పోలీసులు రాకూడదంటే ఎలా?: ఉండవల్లి

Webdunia
శనివారం, 17 నవంబరు 2018 (12:59 IST)
ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి రాష్ట్రంలో అనుమతిని ఉపసంహరిస్తూ.. ఏపీ సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులను ఉండవల్లి తప్పుబట్టారు. సీబీఐ, ఈడీ, ఐటీ విచారణ సంస్థలంటేనే సీఎం వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. 
 
అంతేగాకుండా.. రాష్ట్ర భూభాగ పరిధిలో సీబీఐ విచారణ చేసేందుకు అనుమతి లేదంటూ దేశంలోనే తొలిసారిగా జీవో జారీ చేసిన సీఎం చంద్రబాబేనని ఎద్దేవా చేశారు. తమపై విచారణ జరుగకూడదనే విధంగా సీఎం జీవో జారీ చేశారని తప్పుబట్టారు. 
 
ఊళ్లో అందరూ మంచోళ్లేనని.. పోలీసులు ఊర్లోకి రావాల్సిన అవసరం లేదంటే ఎలా అంటూ ఉండవల్లి ప్రశ్నించారు. వ్యాపారాలు చేసే టీడీపీ నాయకులు.. ప్రజా ప్రతినిధులపై ఐటీ దాడులు జరిగితే తనపై దాడి చేసినట్లుగా సీఎం ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. చంద్రబాబు తన వెనుకున్న కోటీశ్వరుల తరపున వున్నారా.. ప్రజల పక్షంలో వున్నారా అని అడిగారు.
 
తప్పు చేయని పక్షంలో దర్యాప్తు సంస్థలను పంపితే మిగులుతారా.. ప్రధాని ఏం చేయకుండానే ఎందుకు కంగారు పడుతున్నారని.. మోదీ అనుకుంటే తన పరిధిలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు అవినీతిపై విచారణకు ఆదేశించవచ్చని అరుణ్ కుమార్ తెలిపారు. చంద్రబాబు రాజకీయ సమర్థతపై పూర్తి నమ్మకం వుందని.. దేశంలోని అన్నీ పార్టీలతో కలిసిన వారు చంద్రబాబు ఒక్కరేనని ఉండవల్లి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments