గుణదల అరాచకాలకు ఎలా ముగింపు పలకాలో నాకు తెలుసు

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (10:11 IST)
గంజాయిపైనా, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పైనా వ్యాఖ్య‌ల చేసిన టీడీపీ నాయ‌కుడు ప‌ట్టాభి ఇంటిపై వైసీపీ వ‌ర్గాలు దాడిని మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధా ఖండించారు. విజయవాడలో ప‌ట్టాభి ఇంటికి రాధా స్వ‌యంగా వెళ్ళి ఆయ‌న్ని ప‌రామ‌ర్శించారు. పట్టాభి కుటుంబ సభ్యులను పరామర్శించిన వంగవీటి రాధ వారి ఇంటిపై జ‌రిగిన దాడిపై పట్టాభి కుటుంబసభ్యులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. 
 
నాయ‌కుల ఇళ్లపై దాడి చేయడంపై వంగ‌వీటి రాధా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లపైకి వచ్చి మహిళలపై దాడి చేసి, చిన్న పిల్లలను భయబ్రాంతులకు గురిచేయడం నీచమైన చర్యగా అభివ‌ర్ణించారు. గుణదల నీచ రాజకీయాలు  తిరిగి పురుడు పోసుకుంటున్నాయి అనేందుకు ఇదే నిదర్శనం అని రాధా వ్యాఖ్యానించారు.

ఇళ్లల్లో ఉన్న మహిళలపై దాడి చేసేంత హేయమైన చర్యలకు ముగింపు ఏంటో చూపిస్తాన‌ని వంగ‌వీటి రాధా తీవ్రంగా హెచ్చ‌రించారు. గుణదల అరాచకాలకు ఎలా ముగింపు పలకాలో నాకు తెలుసు అని రాధా తీవ్ర స్వ‌యంతో అన్నారు. దీనితో అటు టీడీపీ, ఇటు వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య ఇపుడు ప‌చ్చ గ‌డ్డి వేస్తే, భ‌గ్గుమ‌నే ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments