త్వరలోనే ఏపీకి మంచి రోజులు.. నవ్యాంధ్రకు అమరావతే రాజధాని : డీఎల్ రవీంద్రారెడ్డి

Webdunia
ఆదివారం, 22 జనవరి 2023 (15:15 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి త్వరలోనే మంచి రోజులు రానున్నాయని వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు. అదేసమయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మనస్సులో లేకపోయినప్పటికీ ప్రజలందరి దృష్టిలో నవ్యాంధ్ర రాజధాని అమరావతే అని ఆయన అన్నారు. పైగా, ఈ విషయంలో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లినా గెలవలేరని డీఎల్ అన్నారు. 
 
రాజధాని అమరావతికి మద్దతు ఇవ్వాల్సిందిగా అమరావతి జేఏసీ నేతలు డీఎల్ రవీంద్రారెడ్డిని కలిసి కోరారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ దృష్టిలో కాకపోయినా ప్రజల దృష్టిలో అమరావతే రాజధాని అని వ్యాఖ్యానించారు. అందువల్ల జగన్ సుప్రీంకోర్టుకు వెళ్ళినా గెలవలేరని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉంటుందని స్పష్టం చేశారు. 
 
జగన్ ఆలోచన అంతా అధికారం, డబ్బు తప్ప మరేమీ ఉండదన్నారు. ప్రత్యర్థులను వేధించడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారని, అందుకే ఆయన అధికారంలోకి వచ్చినట్టుగా ఉందన్నారు. జగన్ రెడ్డి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఓటమి తథ్యమని, అదేసమయంలో ఏపీకి త్వరలోనే మంచి రోజులు వస్తాయని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

Rajamouli : బాహుబలి ది ఎపిక్ తో సరికొత్త ఫార్మెట్ లో రాజమౌళి మార్కెటింగ్ సక్సెస్

Rashmika : రష్మిక మందన్న ఫిల్మ్ మైసా కి స్టార్ కంపోజర్ జేక్స్ బిజోయ్ మ్యూజిక్

OG Trend: ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ ఓజీతో నయా ప్లాట్‌ఫాం గ్రాండ్ ఎంట్రీ..

Rahul Sankrityan: వీడీ 14 లో విజయ్ దేవరకొండ విశ్వరూపం చూస్తారు - రాహుల్ సంకృత్యన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments