Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుకు పితృ వియోగం

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (12:03 IST)
మాజీ మంత్రి, తెలుగుదేశం నాయ‌కుడు దేవినేని ఉమామహేశ్వర రావు తండ్రి దేవినేని శ్రీమన్నారాయణ (చిన్ని) కొద్ది సేపటి క్రితం విజయవాడ రమేష్ హాస్పిటల్ గుండెపోటుతో మృతి చెందారు. ఆయ‌న స్వ‌గ్రామం కృష్ణా జిల్లా కంచికచ‌ర్ల‌. ఆయ‌న పెద్ద కుమారుడు, మాజీ మంత్రి దేవినేని ర‌మ‌ణ గ‌తంలో రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందారు. 
 
 
దేవినేని శ్రీమన్నారాయణ మృత దేహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు కంచికచర్లకు వ‌స్తున్న‌ట్లు టిడిపి వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఉదయం చంద్రబాబు ఉడండవల్లి లోని ఆయన నివాసం నుండి నేరుగా కంచికచర్ల గొట్టుముక్కల రోడ్డులో దేవినేని ఉమ ఇంటికి వస్తారన్నారు.


అనారోగ్యంతో మృతి చెందిన దేవినేని శ్రీమన్నారాయణ మృతదేహాన్ని చంద్ర‌బాబు సందర్శించి నివాళులు అర్పిస్తారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించనున్నట్లు టిడిపి వర్గాలు తెలిపాయి. చంద్రబాబు వెంట, మాజీ మంత్రులు పార్టీ ముఖ్య నేతలు కూడా వస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments