Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెల్లని కుర్తా.. నల్లని ప్యాంటులో శాంతి దూతలా జగన్ నయా లుక్.. అదిరిపోయింది గురూ...!!

వరుణ్
మంగళవారం, 2 జులై 2024 (14:02 IST)
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త లుక్‌లో కనిపించారు. తెల్లని కుర్తా, నల్లని ఫ్యాంటు ధరించి కనిపించారు. ఈ ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. గత మే నెల 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ సారథ్యంలోని వైకాపా చిత్తుగా ఓడిపోయిన విషయం తెల్సిందే. గత ఎన్నికల్లో 151 సీట్లను గెలుచుకున్న ఈ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఆ తర్వాత అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్... పులివెందుల నుంచి తొలుత హైదరాబాద్‌కు అక్కడ నుంచి బెంగుళూరులోని తన ప్యాలెస్‌కు వెళ్లారు. గత వారం రోజులుగా ఆయన అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం కొత్త లుక్‌లో కనిపించారు. ఈ లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తెల్లని కుర్తా, బ్లాక్ ప్యాంటులో మెరిసిపోయారు. వారం రోజులుగా బెంగుళూరులోనే ఉంటున్న ఆయన తన ప్యాలెస్‌కు వచ్చే అభిమానులతో కలిసి ఫోటోలు దిగుతున్నారు. ఇపుడీ ఫోటోలు సామాజికమాద్యమంలో వైరల్ అవుతున్నాయి. 
 
ఈ ఫోటోలను చూస్తున్న అభిమానులు.. జగన్‌ను ఈ విధంగా ఎన్నడూ చూడలేదని అంటున్నారు. అంతేకాకుండా జగన్ ఓ శాంతిదూతలా కనిపిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలావుంటే, జగన్మోహన్ రెడ్డి మంగళవారం బెంగుళూరు నుంచి విజయవాడ తాడేపల్లికి చేరుకోనున్నారు. ఆయన ప్రత్యేక విమానంలో బెంగుళూరు నుంచి విజయవాడకు వస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments