Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు జిల్లాలో మాజీ సైనికుడి బీభత్సం - ఇద్దరి మృతి

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (07:37 IST)
ఏపీలోని గుంటూరు జిల్లాలో ఓ మాజీ సైనికుడు తుపాకీతో బీభత్సం సృష్టించాడు. విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో జిల్లాలోని మాచర్ల ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మాచర్ల మండలం రాయవరంలో మట్టా సాంబశివరావు అనే వ్యక్తి గతంలో ఆర్మీలో పని చేసిన మాజీ సైనికుడు. ఈయన తుపాకీతో బీభత్సం సృష్టించాడు. 
 
ఓ పొలం వివాదంలో సాంబశివ రావుకు, శివ, బాలకృష్ణ తదితరులతో వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణ ముదరడంతో సాంబశివరావు తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. మొత్తం 8 రౌండ్లు కాల్పులు జరపగా, ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో శివ, బాలకృష్ణ సంఘటన స్థలంలోనే కుప్పకూలారు. 
 
వీరిద్దరూ రైతులు. ఈ ఘటనలో ఆంజనేయులు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడు ప్రస్తుతం మాచర్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాజీ సైనికుడు సాంబశివరావును అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments