Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు జిల్లాలో మాజీ సైనికుడి బీభత్సం - ఇద్దరి మృతి

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (07:37 IST)
ఏపీలోని గుంటూరు జిల్లాలో ఓ మాజీ సైనికుడు తుపాకీతో బీభత్సం సృష్టించాడు. విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో జిల్లాలోని మాచర్ల ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మాచర్ల మండలం రాయవరంలో మట్టా సాంబశివరావు అనే వ్యక్తి గతంలో ఆర్మీలో పని చేసిన మాజీ సైనికుడు. ఈయన తుపాకీతో బీభత్సం సృష్టించాడు. 
 
ఓ పొలం వివాదంలో సాంబశివ రావుకు, శివ, బాలకృష్ణ తదితరులతో వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణ ముదరడంతో సాంబశివరావు తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. మొత్తం 8 రౌండ్లు కాల్పులు జరపగా, ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో శివ, బాలకృష్ణ సంఘటన స్థలంలోనే కుప్పకూలారు. 
 
వీరిద్దరూ రైతులు. ఈ ఘటనలో ఆంజనేయులు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడు ప్రస్తుతం మాచర్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాజీ సైనికుడు సాంబశివరావును అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments