Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా వంటి దేశాల్లో కూడా పీపీఈ కిట్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది: ఏపీ మంత్రి బుగ్గన

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (19:38 IST)
కరోనా వైరస్ పై పోరాటంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్న వైద్యులకు పీపీఈ కిట్లు అందజేయాలని ప్రతి ప్రభుత్వంపైనా ఒత్తిడి పెరుగుతోంది. ఈ అంశంపై ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో పీపీఈ కిట్ల కొరత ఉన్నా, తమ వద్ద ఉన్నంతవరకు అందిస్తున్నామని తెలిపారు.
 
 అమెరికా వంటి దేశాల్లోనే డాక్టర్లందరికీ పీపీఈ కిట్లు, మాస్కులు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని అన్నారు. కరోనాపై పోరుకు తమ ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉందని, వైద్య పరికరాల కొనుగోలుకు సీఎం జగన్ వెనుకడుగు వేయడం లేదని స్పష్టం చేశారు. విపక్షాలు ప్రతిదానికి విమర్శిస్తుండడం సరికాదని హితవు పలికారు.
 
ఏపీలో తొలుత తక్కువ కేసులే నమోదైనా, ఓ సంఘటన కారణంగా రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరిగిందని వివరించారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో కరోనా నిర్ధారణ కేంద్రాలను 4 నుంచి 7కి పెంచామని తెలిపారు.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments