Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలకు ఎలక్ట్రిక్ బస్సులు - మరో 4 నెలల్లో సేవలు

Webdunia
గురువారం, 8 జులై 2021 (09:07 IST)
తిరుమల, తిరుపతిలో మరో నాలుగు నెలల్లో ఎలక్ట్రిక్ బస్సులు సేవలు అందించనున్నాయి. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. అద్దె ప్రాతిపదికన ఈ బస్సులను నడిపేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తిరుమల ఘాట్, తిరుపతిలో 100 బస్సులతోపాటు విశాఖలో 100, విజయవాడ, గుంటూరు, కాకినాడలలో 50 చొప్పున మొత్తం 350 ఎలక్ట్రిక్ బస్సులకు ఐదు లాట్లుగా ప్రభుత్వం టెండర్లు పిలిచింది. 
 
ఇందులో తిరుపతి అర్బన్, తిరుమల ఘాట్‌లో బస్సులు నడిపేందుకు ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఒలెక్ట్రా) ఎల్-1గా నిలిచింది. ఆర్టీసీ డీజిల్ ఏసీ బస్సులకు ప్రతి కిలోమీటర్‌కు అయ్యే ఖర్చుకే ఈ సంస్థ బస్సులు నడపనుంది. విద్యుత్ చార్జితో కలిపి తిరుమల ఘాట్‌లో కిలోమీటరకు రూ. 52.52, తిరుపతి అర్బన్‌లో 44.95 చొప్పున ప్రభుత్వం అద్దె చెల్లించనుంది.
 
ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడంతో ఫేమ్-2 కింద వీటికి సాయం అందించాలని కేంద్రానికి ఆర్టీసీ అధికారులు నిన్న సమాచారం పంపారు. 
 
కాగా, విశాఖపట్టణం, గుంటూరు బస్సు టెండర్లలో ఈవీ ట్రాన్స్ (ఒలెక్ట్రా), విజయవాడ, కాకినాడల్లో అశోక్ లేలాండ్ ఎల్-1గా నిలిచాయి. అయితే, ఇవి ఎక్కువగా కోట్ చేయడంతో ప్రభుత్వం నుంచి ఆమోదం లభించలేదు. దీంతో ఈ టెండర్లు కథ ముగిసినట్టేనని అధికారులు పేర్కొన్నారు. 

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments