Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం.. ఏడేళ్ల చిన్నారి బలి.. కన్నబిడ్డకు అడ్డుగా వుందని..

వివాహేతర సంబంధం.. ఓ చిన్నారి ప్రాణాలు బలితీసుకుంది. ఈ ఘటన తమిళనాడు, ఈరోడ్డు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈరోడ్డు జిల్లా పెరుందురై సమీప కరుమాండిసెల్లిపాళయానికి చెందిన షణ్ముగనాథన్‌(40),

Webdunia
మంగళవారం, 15 మే 2018 (17:49 IST)
వివాహేతర సంబంధం.. ఓ చిన్నారి ప్రాణాలు బలితీసుకుంది. ఈ ఘటన తమిళనాడు, ఈరోడ్డు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈరోడ్డు జిల్లా పెరుందురై సమీప కరుమాండిసెల్లిపాళయానికి చెందిన షణ్ముగనాథన్‌(40), కనక (34) దంపతులకు తనిష్క (7) అనే కుమార్తె ఉంది.


రెండు రోజుల క్రితం ఆడుకునేందుకు వెళ్లిన తనిష్క అదే ప్రాంతంలోని ఓ చెట్టు సమీపంలో రక్తగాయాలతో మృతిచెంది ఉండటాన్ని పోలీసులు గమనించారు. బాలిక మృతదేహానికి జరిపిన పోస్టుమార్టంలో ఆమె గొంతు నులిమి హత్య చేయబడిందని తేలింది. 
 
ఈ కేసు విచారణలో తనిష్కను పక్కింటి వనిత (33) గొంతు నులిమి హత్య చేసిందని తేలింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు తనిష్క ఇంటి పక్కనే ఉన్న వనితను అదుపులోకి తీసుకుని చేపట్టిన విచారణలో చిన్నారిని తానే హత్యచేసినట్లు ఆమె అంగీకరించింది. కనక భర్త మద్యానికి బానిస కావడంతో తరచూ వారి మధ్య విభేదాలు తలెత్తుతుండేవని.. ఆ క్రమంలో, ఇంటి పక్కనే ఉన్న కమల్‌కన్నన్‌ (వనిత భర్త)కు కనకతో ఏర్పడిన పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది.
 
కమల్‌కన్నన్‌ ఎక్కువ సేపు కనకతో ఉండడం, ఆమె కుమార్తె తనిష్కను మరింత ప్రేమగా చూసుకోవడంపై వనిత భర్తను నిలదీసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో తనిష్క ఉంటే తాను, తన ఎమిదేళ్ల కుమారుడు బతకలేమని నిర్ణయించుకున్న వనిత చిన్నారిని హత్య చేయాలని నిర్ణయించుకుంది.

బయట ఆడుకుంటున్న చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేశానంది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి.. జైలుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments