Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోన్ యాప్ వేధింపులు.. ఇంజనీరింగ్ విద్యార్థి కృష్ణానదిలో పడి ఆత్మహత్య

సెల్వి
సోమవారం, 27 మే 2024 (17:49 IST)
లోన్ యాప్ ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ప్రాణాలు బలిగొంది. లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక ఇంజనీరింగ్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఏపీలోని విజయవాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏపీలోని విజ‌య‌వాడ‌కు చెందిన మురికింటి వంశీ (22) ఇంజినీరింగ్ ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దువుతున్నాడు. 
 
అవ‌స‌రం ఉండ‌డంతో ఇంట్లో తెలియ‌కుండా ఓ లోన్ యాప్‌లో రూ.10వేలు రుణం తీసుకున్నాడు. అయితే యాప్ నిర్వాహ‌కులు అత‌డిని రూ. 1ల‌క్ష క‌ట్టాలంటూ వేధింపుల‌కు గురిచేశారు. 
 
ఇంట్లో ఈ విషయం చెప్పడానికి భయపడిన వంశీ ఇంటి నుంచి ఈ నెల 25న వెళ్లిపోయాడు. అనంత‌రం తాను చ‌నిపోతున్న‌ట్లు కుటుంబ స‌భ్యుల‌కు సందేశం పంపాడు. ఆ త‌ర్వాత నుంచి అత‌ని ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. 
 
ఆందోళ‌న చెందిన కుటుంబీకులు రెండు రోజులుగా వంశీ కోసం గాలించారు. కృష్ణా న‌ది వద్ద అత‌ని మొబైల్ ఫోన్‌, బైక్‌, చెప్పుల‌ను గుర్తించిన పోలీసులు అందులో గాలింపు చర్యలు చేపట్టారు. 
 
అక్కడ వంశీ మృత‌దేహం దొరికింది. తండ్రి ఫిర్యాదు మేర‌కు తాడేప‌ల్లి పోలీసులు మృత‌దేహాన్ని బ‌య‌ట‌కు తీశారు. అనంత‌రం కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

Prabhas: నిర్మాత వదిలేసినా, ఇండస్ట్రీ వద్దన్నా మారుతీ తో ప్రభాస్ రాజాసాబ్ ఎందుకు చేశాడు

Rashmika: మా కెమిస్ట్రీ చూశాక మరిన్ని అవకాశాలు వస్తాయి : రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments