Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ చైతన్య చీఫ్ బీఎస్ రావుకు అదే ప్రేరణ.. చంద్రబాబు సంతాపం

Webdunia
గురువారం, 13 జులై 2023 (21:44 IST)
BS Rao
శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత బీఎస్ రావు ఇకలేరు. బాలికల కోసం ప్రత్యేకించి కళాశాలలు కనిపించకపోవడం.. పదో తరగతిలో మంచి ఫలితాలు సాధిస్తున్న విద్యార్థులు ఇంటర్ విద్యకు వచ్చేసరికి సరైన ప్రతిభ కనబరచకపోవడంతోనే తాను శ్రీ చైతన్య విద్యా సంస్థను ఏర్పాటు చేసేందుకు ప్రేరణగా నిలిచిందని ఆ సంస్థల అధినేత, బీఎస్ రావు గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 
 
ఇరాన్ నుంచి భారత్‌కు వచ్చి తన కుమార్తెల విద్య కోసం మంచి స్కూల్ వెతికతే కనబడలేదని.. ఆ క్రమంలోనే బాలికల కోసం.. ఇంటర్ విద్యార్థుల కోసం పోటీ పరీక్షలకు శిక్షణా సంస్థను స్థాపించినట్లు తెలిపారు. అనతికాలంలోనే తమ విద్యా సంస్థల్లోని విద్యార్థులకు ఐఐటీ, నీట్‌లలో మంచి మార్కులు వచ్చాయన్నారు. అలా స్థాపించిన శ్రీచైతన్య తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశంలో పలు రాష్ట్రాలకు చేరిందన్నారు. 
 
ఇకపోతే.. బీఎస్ రావు మృతి పట్ల ప్రముఖ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. విద్యా దార్శనికుడు, శ్రీచైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకుడు ఇక లేరని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు. అత్యంత నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి బీఎస్ రావు ఎంతగానో కృషి చేశారని చంద్రబాబు కొనియాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments