Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏలూరు మున్సిపల్ పోల్ : 4 నెలల తర్వాత ఓట్ల లెక్కింపు

Webdunia
ఆదివారం, 25 జులై 2021 (10:24 IST)
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు నగరపాలక సంస్థ (మున్సిపాలిటీ)కి నాలుగు నెలల క్రితం జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం ప్రారంభమైంది. మొత్తం 50 డివిజన్లకుగాను మూడు డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 
 
దీంతో మిగిలిన వాటికి మార్చి 10న ఎన్నికలు జరిగాయి. అయితే అప్పట్లో వివాదాల నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా ఈ నెల 25న ఓట్లను లెక్కించి ఫలితాలు విడుదల చేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. 
 
ఈ నేపథ్యంలో నగర శివారులోని సీఆర్ రెడ్డి కళాశాలలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేసిన అధికారులు ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటలకు తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
 
ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు వీలుగా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. లెక్కింపులో కరోనా నిబంధనలు పాటిస్తున్నారు. కౌంటింగ్ ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. 
 
మొత్తం 50 డివిజన్లకు గాను వైసీపీ 47 స్థానాల్లో పోటీ చేయగా, టీడీపీ 43, జనసేన 20 చోట్ల పోటీ చేసింది. ఇతర అభ్యర్థులతో కలిసి మొత్తం 171 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నెల 30న మేయర్ , డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments