Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్కారు ఇంటి నిర్మాణం కోసం అప్పు.. తిరిగి చెల్లించలేక వ్యక్తి ఆత్మహత్య

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2023 (09:17 IST)
ఏపీలోని ఏలూరు జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా ఇంటి నిర్మాణం కోసం రూ.4 లక్షల మేరకు అప్పు చేసిన ఓ వివాహితుడు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఏలూరు జిల్లా పోలవరం మండలంలోని ప్రగడపల్లిలో జరిగింది.
 
పోలీసుల కథనం మేరకు.. ప్రగడపల్లి గ్రామానికి చెందిన కడిమి సుబ్రహ్మణ్యం(24) కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి నిర్మాణానికి సుమారు రూ.4 లక్షలు అప్పు చేశారు. ప్రస్తుతం ఎక్కడా కూలీ పనులు దొరక్కపోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఈ నెల 13వ తేదీన పురుగుల మందు తాగారు. 
 
దీన్ని గమనించిన బంధువులు, గ్రామస్తులంతా కలిసి స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి, అక్కడి నుంచి తూర్పుగోదావరి జిల్లా చాగల్లులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందడంతో ఆదివారం మృతదేహాన్ని పోలవరం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. భార్య మౌనిక ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు. శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments