Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం, పంటలనే కాదు రైతులను తొక్కి చంపుతున్నాయి

Webdunia
బుధవారం, 26 మే 2021 (21:21 IST)
చిత్తూరు జిల్లాలో గజరాజులు భీభత్సం సృష్టిస్తున్నాయి. రాత్రి, పగలు అని తేడా లేకుండా ఇష్టానుసారం రోడ్లపైన, జనావాసాల మధ్య, పొలాల్లో, గ్రామాల మధ్య ఇలా ఎక్కడపడితే అక్కడ తిరిగేస్తున్నాయి. ఏనుగులను భయపెట్టి అటవీ ప్రాంతంలోకి తరుముదామని చూస్తున్న వారిపై దాడి చేస్తున్నాయి.
 
చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాల్లో ఏనుగల భీభత్సం అంతా ఇంతా కాదు. వేల ఎకరాల్లో పంటలను ధ్వంసం చేశాయి. పదుల సంఖ్యలో రైతులు, గ్రామస్తులను గాయపరిచాయి. అటవీ శాఖాధికారులకు ఎన్నిసార్లు గ్రామస్తులు మొరపెట్టుకుంటున్నా ఉపయోగం లేకుండా పోతోంది.
 
తాజాగా గంగాదర నెల్లూరు మండలం వేల్కూరు ఇందిరానగర్ గ్రామ సమీపంలో ఏనుగుల సంచారం కనిపించింది. పంట పొలాల్లో పనిచేస్తున్న వజ్రవేలు అనే వ్యక్తి ఏనుగుల గుంపును తరిమేందుకు ప్రయత్నించడంతో అతనిపై ఏనుగులు దాడి చేశాయి. దీంతో అతన్ని హుటాహుటిన తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ వజ్రవేలు మృతి చెందారు. గత వారం రోజుల్లోనే ముగ్గురు ఏనుగుల దాడిలో మృత్యువాతపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పేక మేడలు నుంచి ఫస్ట్ సింగిల్ 'బూమ్ బూమ్ లచ్చన్న సాంగ్ విడుదల

కాశీ, కాంప్లెక్స్, శంబాలా గురించి రివిల్ చేసిన కల్కి 2898 AD రిలీజ్ ట్రైలర్

అడవి శేష్ పేరు మారిపోయింది.. ఇందుకు సన్నీ లియోన్‌నే కారణమా?

వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల చిత్రం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

పద్మవ్యూహంలో చక్రధారి ఎలా ఉందంటే.. రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

సహజసిద్ధంగా మధుమేహాన్ని నియంత్రించే మార్గాలు ఇవే

బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments