Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం, పంటలనే కాదు రైతులను తొక్కి చంపుతున్నాయి

Webdunia
బుధవారం, 26 మే 2021 (21:21 IST)
చిత్తూరు జిల్లాలో గజరాజులు భీభత్సం సృష్టిస్తున్నాయి. రాత్రి, పగలు అని తేడా లేకుండా ఇష్టానుసారం రోడ్లపైన, జనావాసాల మధ్య, పొలాల్లో, గ్రామాల మధ్య ఇలా ఎక్కడపడితే అక్కడ తిరిగేస్తున్నాయి. ఏనుగులను భయపెట్టి అటవీ ప్రాంతంలోకి తరుముదామని చూస్తున్న వారిపై దాడి చేస్తున్నాయి.
 
చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాల్లో ఏనుగల భీభత్సం అంతా ఇంతా కాదు. వేల ఎకరాల్లో పంటలను ధ్వంసం చేశాయి. పదుల సంఖ్యలో రైతులు, గ్రామస్తులను గాయపరిచాయి. అటవీ శాఖాధికారులకు ఎన్నిసార్లు గ్రామస్తులు మొరపెట్టుకుంటున్నా ఉపయోగం లేకుండా పోతోంది.
 
తాజాగా గంగాదర నెల్లూరు మండలం వేల్కూరు ఇందిరానగర్ గ్రామ సమీపంలో ఏనుగుల సంచారం కనిపించింది. పంట పొలాల్లో పనిచేస్తున్న వజ్రవేలు అనే వ్యక్తి ఏనుగుల గుంపును తరిమేందుకు ప్రయత్నించడంతో అతనిపై ఏనుగులు దాడి చేశాయి. దీంతో అతన్ని హుటాహుటిన తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ వజ్రవేలు మృతి చెందారు. గత వారం రోజుల్లోనే ముగ్గురు ఏనుగుల దాడిలో మృత్యువాతపడ్డారు. 

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments