Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌రెంటు బిల్లుల కాల్చివేత‌... బెజ‌వాడ‌లో సిపిఐ గ‌రం గ‌రం!

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (14:10 IST)
పెంచిన విద్యుత్ సర్దుబాటు చార్జీలను రద్దు చేయాల‌ని సిపిఐ విజ‌య‌వాడ నగర కార్యవర్గ సభ్యుడు కే వి భాస్కర రావు డిమాండ్ చేశారు. సిపిఐ విజ‌య‌వాడ‌లోని 58 డివిజన్ ఆధ్వర్యంలో హోచిమిన్ భవన్ వద్ద పెంచిన విద్యుత్ చార్జీలను రద్దు చేయాలని నిరసన కార్యక్రమం చేశారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో పెంచిన విద్యుత్ బిల్లుల‌ను సీపిఐ కార్య‌క‌ర్త‌లు ద‌హ‌నం చేశారు. 
 
ఈ సందర్భంగా కె వి భాస్కర రావు మాట్లాడుతూ, కరోనా కష్టాలతో నలిగిపోయిన ప్రజలకు మూలిగే నక్కమీద తాటికాయ పడినట్లు సర్దుబాటు చార్జీల పేరిట కరెంటు చార్జీలను ఏకంగా యూనిట్ కి 1.23 పైసలు పెంచడం దారుణమన్నారు. ఇది వరకే పెంచిన పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలతోపాటు ప్రస్తుతం పెంచిన విద్యుత్ చార్జీలతో ప్రజల నెత్తిన పిడుగు పడినట్లుగా ఉంద‌ని పేర్కొన్నారు.
 
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పెరిగిన విద్యుత్ చార్జీలు తగ్గించకపోతే పోరాటాల ద్వారా ముందుకు వెళ్తామన్నారు, ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, ఎస్కే సుభాని, ఎల్ శివకుమార్, కె ఆదినారాయణ చంద్ర ,రవికుమార్, పి రాములు యన్ లక్ష్మీనారాయణ, ఎండి గౌస్ , నాగరాజు, నాగూర్ మీరా, మహిళా నాయకురాలు తమ్మిన దుర్గ ,పుష్ప ,కన్నమ్మ శంకరమ్మ,రాజ్యలక్ష్మి షకీలా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments