Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌రెంటు బిల్లుల కాల్చివేత‌... బెజ‌వాడ‌లో సిపిఐ గ‌రం గ‌రం!

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (14:10 IST)
పెంచిన విద్యుత్ సర్దుబాటు చార్జీలను రద్దు చేయాల‌ని సిపిఐ విజ‌య‌వాడ నగర కార్యవర్గ సభ్యుడు కే వి భాస్కర రావు డిమాండ్ చేశారు. సిపిఐ విజ‌య‌వాడ‌లోని 58 డివిజన్ ఆధ్వర్యంలో హోచిమిన్ భవన్ వద్ద పెంచిన విద్యుత్ చార్జీలను రద్దు చేయాలని నిరసన కార్యక్రమం చేశారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో పెంచిన విద్యుత్ బిల్లుల‌ను సీపిఐ కార్య‌క‌ర్త‌లు ద‌హ‌నం చేశారు. 
 
ఈ సందర్భంగా కె వి భాస్కర రావు మాట్లాడుతూ, కరోనా కష్టాలతో నలిగిపోయిన ప్రజలకు మూలిగే నక్కమీద తాటికాయ పడినట్లు సర్దుబాటు చార్జీల పేరిట కరెంటు చార్జీలను ఏకంగా యూనిట్ కి 1.23 పైసలు పెంచడం దారుణమన్నారు. ఇది వరకే పెంచిన పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలతోపాటు ప్రస్తుతం పెంచిన విద్యుత్ చార్జీలతో ప్రజల నెత్తిన పిడుగు పడినట్లుగా ఉంద‌ని పేర్కొన్నారు.
 
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పెరిగిన విద్యుత్ చార్జీలు తగ్గించకపోతే పోరాటాల ద్వారా ముందుకు వెళ్తామన్నారు, ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, ఎస్కే సుభాని, ఎల్ శివకుమార్, కె ఆదినారాయణ చంద్ర ,రవికుమార్, పి రాములు యన్ లక్ష్మీనారాయణ, ఎండి గౌస్ , నాగరాజు, నాగూర్ మీరా, మహిళా నాయకురాలు తమ్మిన దుర్గ ,పుష్ప ,కన్నమ్మ శంకరమ్మ,రాజ్యలక్ష్మి షకీలా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లోనే అడల్ట్ కంటెంట్ - దానిని టీనేజర్స్ తో పబ్లిసిటీ

కాటన్ దొర సైతం డొక్కా సీతమ్మ ని లండన్‌కు రమ్మన్నారు : మురళీ మోహన్

జెరెమీ ఐరన్స్ తో హాలీవుడ్‌ లో నటించే కల నెరవేరింది: వరలక్ష్మి శరత్‌కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments