Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడపజిల్లాలో 13 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిలిపివేత, అక్కడేం జరుగుతోంది?

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (09:37 IST)
కడప జిల్లాలోని 13 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిలిచాయి. ఇటీవల విభజన చేస్తూ 13 పంచాయతీలను ప్రభుత్వం పెంచింది. విభజనను వ్యతిరేకిస్తూ కొందరు నేతలు హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై స్పందించిన ఎపి హైకోర్టు విభజించిన 13 పంచాయతీలకు ప్రస్తుతం ఎన్నికలు ఆపాలని స్టే ఇచ్చింది. హైకోర్టు స్టేతో 13 పంచాయతీలకు ఎన్నికలు నిలిచిపోయాయి.

రేపు ఉదయం కడపకు ఎస్ఈసీ
అమరావతి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ శుక్రవారం నుంచి రెండు రోజులు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు.

శుక్రవారం అనంతపురం, కర్నూలు జిల్లాల్లో.. శనివారం కడప జిల్లాలో ఎన్నికల ప్రక్రియను పరిశీలించనున్నారు. పర్యటన షెడ్యూల్‌ను ఎస్‌ఈసీ ప్రకటించింది.

శుక్రవారం ఉదయం విజయవాడ నుంచి బెంగుళూరుకు విమానంలో వెళ్లి.. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం వెళ్తారు. అక్కడి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం రోడ్డు మార్గాన కర్నూలు వెళ్తారు.

అధికారులతో సమీక్ష అనంతరం రాత్రికి అక్కడే బసచేస్తారు. శనివారం ఉదయం రోడ్డుమార్గాన కడప వెళ్తారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఉదయం 11.30 గంటలకు కడప నుంచి విమానంలో విజయవాడకు బయల్దేరతారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments