Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్సీలకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ఎస్సీ కమిషన్ కృషి : ఎస్సీ కమిషన్ ఛైర్మన్

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (18:31 IST)
ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీల  పై జరుగుతున్న అరచకాలను అడ్డుకోవాల్సిన అవసరముందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ పేర్కొన్నారు.  ఈ రోజు మధ్యాహ్నం ఆంధ్ర ప్రదేశ్ భవన్ లోని గురజాడ కాన్ఫరెన్స్ హాల్ లో ఆయన విలేఖరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 24 న బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రముఖులను కలవడానికి ఢిల్లీ రావడం జరిగిందన్నారు.  జాతీయ ఏసీ కమిషన్ ఛైర్మన్ విజయ్ సంప్లా, వైస్ చైర్పర్సన్ అరుణ్ హైదర్ లను కలిశామన్నారు. 

41 (సీ) వల్ల ఎస్సీల పై దాడులు చేసిన వారు స్టేషన్ బెయిల్ పై విడుదలవుతున్నారని వివరించారు.  ఎస్సీల పై దాడులు చేసిన వారికి స్టేషన్ బెయిల్ రాకుండా ఉండేందుకు 41 (సీ) రద్దు చేయాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు.  ప్రస్తుతం 7 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న నేరస్థులకు శిక్ష పడటంలేదని తెలిపారు.

ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం ఎస్సీ/ఎస్టీ లకు రక్షణ కల్పించగలగాలన్నారు. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం నేరాలను అడ్డుకోవడానికి, నేరస్తులను శిక్షించడానికి ఉపయోగపడాలని పేర్కొన్నారు.  ఎస్సీ లకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ఎస్సీ కమిషన్ కృషి చేస్తోందన్నారు. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments