Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాష్ట్రంలో పోలీసు రాజ్యం: వర్ల రామయ్య

రాష్ట్రంలో పోలీసు రాజ్యం: వర్ల రామయ్య
, బుధవారం, 10 నవంబరు 2021 (22:22 IST)
రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు.

ఎన్నికల సమయంలో అన్ని ప్రభుత్వ శాఖలు ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు పనిచేయాల్సి ఉండగా.. డీజీపీ గౌతం సవాంగ్‌ నేతృత్వంలో పోలీసు వ్యవస్థ మాత్రమే రాజ్యమేలుతోందని ఆరోపించారు.

కుప్పంలో పోలీసుల తీరుపై ఆయన బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాటాడుతూ మంగళవారం రాత్రి 10.45 గంటలకు కుప్పంలో టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారని, 41 నోటీసు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని ఆయన నిలదీశారు. 

డీజీపీ నేతృత్వంలో అధికార పార్టీ స్థానికంగా ఏది చెబితే అదే చేస్తున్నారని, ఆ పద్ధతి మంచిది కాదని హితవు పలికారు.

అధికార పార్టీ చెప్పిందల్లా చేస్తే భవిష్యత్‌లో పోలీసులు ఇబ్బంది పడతారని వర్ల రామయ్య హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జన జాతరలా అమరావతి రైతుల మహాపాదయాత్ర