Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ అక్రమాస్తుల కేసు : 793 కోట్లను అటాచ్ చేసిన ఈడీ

ఠాగూర్
గురువారం, 17 ఏప్రియల్ 2025 (18:36 IST)
వైకాపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (#Jagan) అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (#ED) కీలక నిర్ణయం తీసుకుంది. రూ.793 కోట్ల విలువ చేసే దాల్మియా సిమెంట్ (#DalimaCement) ఆస్తులను అటాచ్ చేసింది. హైదరాబాద్ నగరంలోని ఈడీ కార్యాలయం మార్చి 31వ తేదీన తాత్కాలిక జప్తు ఉత్తర్వులు జారీ చేయగా తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
కడప జిల్లాలో 417 హెక్టార్ల సున్నపురాయి లీజుల దాల్మియాకు అక్రమంగా కట్టబెట్టారని అభియోగం ఉంది. దాల్మియా నుంచి జగన్ సుమారు రూ.150 కోట్ల ముడుపులు తీసుకున్నారని సీబీఐ (#CBI) చార్జిషీటు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసి విచారిస్తున్న విషయం తెల్సిందే. 
 
ఈ అటాచ్‌‍మెంట్ ఉత్తర్వులు ఈ నెల 15వ తేదీన రాత్రి దాల్మియా సిమెంట్స్‌కు అందాయి. కొనుగోలు చేసినపుడు ఆ భూమి విలువ రూ.377 కోట్లు కాగా, ఇపుడు రూ.793 కోట్లుగా పేర్కొంది. కడప జిల్లా మైలవరం మండలంలోని తలమంచిపట్నం, నవాబ్ పేటలో 407 హెక్టార్లలో సున్నపురాయి గనుల లీజుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని సీబీఐ, ఈడీ అభియోగాలు మోపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments