Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ అక్రమాస్తుల కేసు : 793 కోట్లను అటాచ్ చేసిన ఈడీ

ఠాగూర్
గురువారం, 17 ఏప్రియల్ 2025 (18:36 IST)
వైకాపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (#Jagan) అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (#ED) కీలక నిర్ణయం తీసుకుంది. రూ.793 కోట్ల విలువ చేసే దాల్మియా సిమెంట్ (#DalimaCement) ఆస్తులను అటాచ్ చేసింది. హైదరాబాద్ నగరంలోని ఈడీ కార్యాలయం మార్చి 31వ తేదీన తాత్కాలిక జప్తు ఉత్తర్వులు జారీ చేయగా తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
కడప జిల్లాలో 417 హెక్టార్ల సున్నపురాయి లీజుల దాల్మియాకు అక్రమంగా కట్టబెట్టారని అభియోగం ఉంది. దాల్మియా నుంచి జగన్ సుమారు రూ.150 కోట్ల ముడుపులు తీసుకున్నారని సీబీఐ (#CBI) చార్జిషీటు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసి విచారిస్తున్న విషయం తెల్సిందే. 
 
ఈ అటాచ్‌‍మెంట్ ఉత్తర్వులు ఈ నెల 15వ తేదీన రాత్రి దాల్మియా సిమెంట్స్‌కు అందాయి. కొనుగోలు చేసినపుడు ఆ భూమి విలువ రూ.377 కోట్లు కాగా, ఇపుడు రూ.793 కోట్లుగా పేర్కొంది. కడప జిల్లా మైలవరం మండలంలోని తలమంచిపట్నం, నవాబ్ పేటలో 407 హెక్టార్లలో సున్నపురాయి గనుల లీజుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని సీబీఐ, ఈడీ అభియోగాలు మోపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments