Webdunia - Bharat's app for daily news and videos

Install App

వధూవరుల డ్యాన్స్ కోసం పట్టు.. కొట్టుకున్న బంధువులు

Webdunia
మంగళవారం, 16 మే 2023 (12:02 IST)
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండల రామచంద్రాపురంలో వధూవరులు డ్యాన్సే వేయాల్సిందేనంటూ ఓవర్గం పట్టుబట్టగా, మరో వర్గం అందుకు అంగీకరించలేదు. దీంతో ఇరు వర్గాల మధ్య చెలరేగిన గొడవ చివరకు కొట్లాటకు దారితీసింది. దీంతో ఈ కొట్లాటలో పలువురికి గాయాలయ్యాయి. 
 
పోలీసుల కథనం మేరకు... తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రామచంద్రపురంలో సోమవారం సుబ్రహ్మణ్యం, పూజితల వివాహ వేడుకలకు కుటుంబసభ్యులు ఘనంగా ఏర్పాట్లుచేశారు. పెళ్లికుమార్తె తరపు బంధువులంతా తాళ్లపూడి మండలం గజ్జరం నుంచి విచ్చేశారు. వివాహం అనంతరం విందు జరుగుతోంది. ఆ సమయంలో వధూవరులిద్దరూ డ్యాన్స్‌ చేయాలంటూ అక్కడున్న వారు ఒత్తిడి తెచ్చారు. 
 
ఆడపిల్ల డ్యాన్స్‌ చేయడమేమిటని వధువు తరపు బంధువులు అభ్యంతరం తెలిపారు. మాటామాటా పెరిగి వరుడి కుటుంబ సభ్యులు దాడికి దిగారు. ఈ ఘటనలో ఓ మహిళకు తల పగిలింది. మరో వ్యక్తికి చేయివిరిగింది. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. 
 
కోరుకొండ సీఐ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం వధూవరులతో పాటు వేడుకల్లో పాల్గొన్నవారంతా ఫిర్యాదు ఇచ్చేందుకు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments