Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో 500 మంది ఉద్యోగులను తొలగించనున్న అమెజాన్

Webdunia
మంగళవారం, 16 మే 2023 (11:41 IST)
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలో అస్థిరత నెలకొంది. దీంతో అనేక టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో 500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
అంతర్జాతీయంగా తమ కంపెనీలో పనిచేస్తున్న మొత్తం 9,000 మందిని ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తున్నట్లు మార్చిలో అమెజాన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే భారత్‌లో 500 మందిని ఇంటికి పంపినట్లు సమాచారం. 
 
వెబ్‌ సర్వీసెస్‌, హ్యూమన్‌ రీసోర్సెస్‌, సపోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. వీరిలో కొంత మంది కంపెనీ గ్లోబల్‌ ఆపరేషన్స్‌కు ఇక్కడి నుంచి పనిచేస్తున్న వారున్నారు. ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అస్థిరత నేపథ్యంలో ప్రాధాన్యాలకు అనుగుణంగా ఉద్యోగులను పునర్‌వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు సీఈఓ ఆండీ జస్సీ మార్చిలో వెల్లడించిన విషయం తెలిసిందే.
 
కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో డిమాండ్‌ పెరగడంతో అందుకు అనుగుణంగా భారీ ఎత్తున ఉద్యోగులను నియమించనున్నాయి. కానీ, కరోనా పూర్వస్థితికి వ్యాపార కార్యకలాపాలు చేరుకోవడంతో డిమాండ్‌ మళ్లీ తగ్గింది. 
 
మరోవైపు మాంద్యం, వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలో వినియోగదారులు కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఫలితంగా చాలా కంపెనీలు వ్యయాలను నియంత్రించుకుంటాయి. అందులో భాగంగా మెటా, గూగుల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి దిగ్గజ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments