Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూ.గో వైపు దూసుకొస్తున్న పెథాయ్ తుఫాను... ఏపీలో హైఅలెర్ట్

Webdunia
ఆదివారం, 16 డిశెంబరు 2018 (10:33 IST)
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న పెథాయ్ తుఫాను తూర్పుగోదావరి జిల్లా వైపు దూసుకొస్తోంది. ఇది చెన్నైకు 530 కిలోమీటర్లు, కాకినాడకు దక్షిణ ఆగ్నేయంగా 650 కిలోమీటర్ల దూరంలోవుంది. ఇది ఆదివారం తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. ఈ తుఫాను ఈనెల 17వ తేదీన మచిలీపట్నం - కాకినాడల మధ్య తీరందాటొచ్చని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. 
 
కాగా, ఈ పెథాయ్ తుఫాను తీరందాటే సమయంలో 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. జాలర్లు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని తెలిపింది. ఈ తుఫాను ప్రభావం కారణంగా ఉత్తర తమిళనాడుతో పాటు కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. 
 
ఇదిలావుండగా, తుఫాను ప్రభావిత జిల్లాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రటించింది. అలాగే, 50కిపైగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. 50 వేల నుంచి 75 వేల వరకు విద్యుత్ స్తంభాలను సిద్ధం చేసివుంచింది. అనేక గ్రామాల్లో జనరేటర్లను సిద్ధంగా ఉంచి, విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు ముందస్తు చర్యలు చేపట్టింది. 
 
ఇదిలావుండగా, తూర్పుగోదావరితో పాటు కోస్తాతీర జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. నిత్యావసర వస్తువులను భారీ సంఖ్యలో నిల్వవుంచింది. 2200 పేరుతో ఓ ప్రత్యేక నంబరుతో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. 
 
ఇదిలావుంటే, పెథాయ్ తుఫాను వల్ల తీసుకుంటున్న జాగ్రత్తల విషయంలో ఏపీ సీఎంకు గవర్నర్ నరసింహన్ ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఎటువంటి ప్రాణనష్టం జరుగకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం