Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 25 శాతం వెయిటేజీ తొలగింపు

Webdunia
మంగళవారం, 27 జులై 2021 (22:28 IST)
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈఏపీసెట్ ఇంటర్ మార్కుల వెయిటేజీని తొలగించారు. ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మా ప్రవేశాలకు (ఈఏపీసెట్‌) ఇంటర్‌ మార్కుల వెయిటేజ్ తొలగించింది. ఇప్పటివరకు ఇంటర్‌ మార్కులకు ఇస్తున్న 25 శాతం వెయిటేజీని తొలగించింది. 
 
ఈ ఏడాది ఈఏపీసెట్‌ 100శాతం రాత పరీక్ష మార్కుల ఆధారంగానే ప్రవేశాలు ఉంటాయని ఉన్నత విద్యామండలి కార్యదర్శి సుధీర్‌ ప్రేమ్‌ కుమార్‌ వెల్లడించారు. కరోనా కారణంగా ఇంటర్‌ పరీక్షలు రద్దు చేసినందున ఈ ఒక్క ఏడాదికే ఇంటర్‌ మార్కుల వెయిటేజీ తొలగింపు అమలు చేయనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు.
 
ఏపీ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్‌)-21ను ఆగస్టు 19 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
ఈఏపీసెట్‌ను గతంలో ఎంసెట్‌గా పిలిచేవారు. వైద్యవిద్యలో ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో ప్రత్యేక పరీక్ష (నీట్‌) నిర్వహిస్తున్నందున ఎంసెట్‌లో ‘ఎం’ అనే అక్షరాన్ని తొలగించారు. ఫార్మసీ ప్రవేశాలను ఈ ప్రవేశ పరీక్ష ద్వారా నిర్వహిస్తున్నందున ‘ఎం’ స్థానంలో ‘పి’ ని చేర్చి ఈఏపీసెట్‌గా మార్పు చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments