‘టిక్‌ టాక్‌’ మోజులో...ఏం చేశాడో చూడండి

Webdunia
సోమవారం, 28 అక్టోబరు 2019 (14:51 IST)
‘టిక్‌ టాక్‌’ మోజు పచ్చని కాపురంలో చిచ్చు రేపింది. ఇంట్లో ఓ భార్య ఉండగానే మరో భార్యను వెతుక్కున్నాడు కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం వాసి సత్యంరాజు.

వీటీపీఎస్‌ ఉద్యోగి అయిన సత్యంరాజు 2009లో అనురాధను పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య ఉండగానే టిక్‌ టాక్‌లో పరిచయమైన హైదరాబాద్‌ యువతిని ఐదు నెలల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయంపై గతంలో పెద్దల వద్ద పంచాయతీ జరిగింది.

మారతానని అప్పట్లో అందరిముందు మాట ఇచ్చిన సత్యంరాజు ఆ తర్వాత ఎప్పటిలాగే భార్యకు దూరంగా ఉంటున్నాడు. మానసికంగా తనను వేధిస్తున్నాడని ఆయన భార్య అనురాధ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తన తల్లిదండ్రులను భార్య అనురాధ సరిగా చూసుకోవడం లేదని సత్యంరాజు పోలీసుల వద్ద ఆరోపించాడు. అనురాధ ఫిర్యాదు మేరకు పోలీసులు సత్యంరాజుపై కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్‌ప్లే టూర్ ప్రారంభించింది

నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది

జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

తర్వాతి కథనం
Show comments